News April 19, 2024
భారత నేవీ కొత్త చీఫ్గా దినేశ్ త్రిపాఠి

భారత నేవీ చీఫ్గా అడ్మిరల్ హరి కుమార్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠిని కొత్త చీఫ్గా ప్రకటించింది. ఈనెల 30న త్రిపాఠి నేవీ చీఫ్గా బాధ్యతలు అందుకోనున్నారు. త్రిపాఠి గతంలో వెస్ట్రన్ నేవల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్గా సేవలు అందించారు. ఎన్నో నేవీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 1985 జూలై 1న నేవీలో చేరిన త్రిపాఠి 2019లో వైస్ అడ్మిరల్/వైస్ చీఫ్ హోదా అందుకున్నారు.
Similar News
News October 16, 2025
నచ్చిన ఫుడ్ ఇష్టమొచ్చినట్లు తినేస్తున్నారా?

చాలామంది ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు. నచ్చిన టిఫిన్ అనో, నాన్ వెజ్ కూరనో ఆకలితో సంబంధం లేకుండా పరిమితికి మించి లాగించేస్తుంటారు. కొందరైతే ఫేవరెట్ ఫుడ్ కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు తినేస్తారు. అలాంటి వాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘ఆహారం మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే ఆయుక్షీణం’. అందుకే టిఫిన్, లంచ్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా కంట్రోల్డ్గా తీసుకోండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం.
News October 16, 2025
బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 16, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్ ఫైర్.. ట్రంప్పై సెటైర్లు!

పాకిస్థాన్-అఫ్గాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతా US అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ఆయన ఇంకా ఈ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోలేదా?’ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘ఆయన ఆ మాట చెప్పగానే నోబెల్కి మరోసారి నామినేట్ చేసేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సిద్ధంగా ఉన్నారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.