News March 29, 2024
ఎన్నికల తర్వాత BRS కనుమరుగు: ఉత్తమ్

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ఎంపీ ఎన్నికల్లో మేం 13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 8, 2026
ట్రంప్ను వదిలేది లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

అయతుల్లా ఖమేనీ మృతికి ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరించారు. తమ నాయకుడు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని Xలో స్పష్టం చేశారు. ‘ఇరాన్కు వ్యతిరేకంగా తమ భూభాగాలను US ఉపయోగించుకోకుండా మిడిల్ ఈస్ట్ దేశాలు నిరోధించాలి. ఆ ప్రాంతాల నుంచి దాడి జరిగితే మేం ప్రతిస్పందిస్తాం’ అని తేల్చిచెప్పారు. IRGC కొందరు అమెరికన్ సైనికులను బంధించిందని పేర్కొన్నారు.
News March 8, 2026
కోచ్గా గంభీర్.. విమర్శకుల నోళ్లు మూయిస్తారా?

టీమ్ ఇండియా కోచ్గా ప్రశంసల కంటే <<18976802>>విమర్శలనే<<>> గంభీర్ ఎక్కువ ఎదుర్కొన్నారు. తన వ్యూహాలు, ఎంపికలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక్క మ్యాచ్ ఓడినా, అతడు సపోర్ట్ చేసిన ప్లేయర్ రాణించకున్నా విమర్శకుల దండయాత్ర జరిగేది. కానీ వాటిని దాటుకుని, INDను T20 WC ఫైనల్కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ సూర్యకు అవసరమైన సలహాలిస్తూ నడిపించారు. మరి ఇంకో గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయిస్తారా? కామెంట్ చేయండి.
News March 8, 2026
విద్యార్థులకు సూపర్ న్యూస్

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో 21 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు వారంలో 3 రోజులు రాగి జావ ఇస్తున్నారు. మిగిలిన 3 రోజులు పాలను అందించాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీ స్టూడెంట్లకూ పాలు, రాగి జావ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ కోరుతోంది.


