News March 29, 2024
ఎన్నికల తర్వాత BRS కనుమరుగు: ఉత్తమ్

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ఎంపీ ఎన్నికల్లో మేం 13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 2, 2026
గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు

గల్ఫ్ యుద్ధంతో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్కు అన్ని ఫ్లైట్స్, ఐరోపా దేశాలకు వెళ్లే 6 విమానాలను ఈరోజు రాత్రి 11.59 గంటల వరకు రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. దుబాయ్, షార్జా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. అటు దుబాయ్, సౌదీ, కువైట్ ఎయిర్పోర్టుల్లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News March 2, 2026
అమెరికాకు ఇరాన్ ‘రివర్స్’ షాక్!

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చేజిక్కించుకున్న అమెరికా ఆయుధాలే ఇప్పుడు ఇరాన్కు కీలకం అయ్యాయి. USకు చెందిన BGM-71 TOW యాంటీ ట్యాంక్ మిస్సైల్ను రివర్స్ ఇంజినీరింగ్ చేసి ఇరాన్ ‘తూఫాన్’ తయారుచేసింది. గూఢచారి డ్రోన్ RQ-170 Sentinel డిజైన్తో శక్తిమంతమైన ‘షాహెద్’ డ్రోన్లను రూపొందించింది. జావలిన్, స్టింగర్ వంటి ఆధునిక వెస్ట్రన్ టెక్నీ ఇరాన్ సొంత ఆయుధాల తయారీకి వాడుకుంటూ అగ్రరాజ్యానికే సవాల్ విసురుతోంది.
News March 2, 2026
కట్టె జనుములో కాయ తొలిచే పురుగు – నివారణ

రబీలో సాగు చేసే కట్టె జనుమును కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ శిలీంద్రాల వల్ల విత్తనం రంగుమారడం, కుళ్లిపోవడం జరిగితే కాయ ఏర్పడే దశలో లీటరు నీటికి కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీ చేయాలి.


