News March 29, 2024
ఎన్నికల తర్వాత BRS కనుమరుగు: ఉత్తమ్

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ఎంపీ ఎన్నికల్లో మేం 13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

ఇరాన్ వార్తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.
News March 5, 2026
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News March 5, 2026
ఇరాన్పై దాడులు.. US కాంగ్రెస్లో ట్రంప్కు ఊరట

ఇరాన్పై దాడులతో రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఆ దేశ కాంగ్రెస్లో ఊరట లభించింది. ఈ సైనిక చర్యలపై ట్రంప్ అధికారాన్ని పరిమితం చేయాలన్న తీర్మానాన్ని US సెనేట్ (ఉన్నత సభ) తిరస్కరించింది. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నుంచి ఒకరు, ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ నుంచి మరొకరు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఓటింగ్లో స్వల్ప తేడాతో (53-47) రిజెక్ట్ అయింది.


