News March 29, 2024
ఎన్నికల తర్వాత BRS కనుమరుగు: ఉత్తమ్

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ఎంపీ ఎన్నికల్లో మేం 13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
రోజ్ మేరీ ఆయిల్తో జుట్టుకు ఎన్నో లాభాలు

నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. వాటికోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ వాడతారు. వాటిల్లో ఒకటే రోజ్ మేరీ ఆయిల్. ఇందులో ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి ఉంటాయి. దీనిని వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణ లభిస్తుంది. జుట్టు నిగనిగలాడుతూ కాంతిమంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలలో చక్కటి ఫలితాలుంటాయి. త్వరగా పొడిబారే జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
News February 11, 2026
మీ ‘ఓటు’ ఎక్కడుందో తెలుసుకోండిలా

TG: మున్సిపోల్ నేపథ్యంలో ఓటర్ స్లిప్ను ప్రభుత్వ వెబ్సైట్ లేదా Te-Poll మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చని EC తెలిపింది. <
News February 11, 2026
US-బంగ్లా డీల్.. భారత్కు దెబ్బ!

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం భారత టెక్స్టైల్ రంగంపై ప్రభావం చూపించనుంది. US మెటీరియల్స్(కాటన్, మ్యాన్ మేడ్ టెక్స్టైల్స్)తో తయారు చేసిన వస్తువులను జీరో టారిఫ్స్తో ఎగుమతి చేసేందుకు బంగ్లాకు అవకాశం దక్కనుంది. కానీ మన వస్త్ర ఎగుమతులపై మాత్రం 18% సుంకం పడనుంది. బంగ్లా కాటన్ దిగుమతుల్లో గతంలో 70% ఇండియా నుంచే వెళ్లేది. ఇటీవల కొంత తగ్గగా, తాజా డీల్తో US కాటన్కే బంగ్లా మొగ్గుచూపనుంది.


