News November 3, 2024

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యంపై బిహార్‌లో చ‌ర్చ‌

image

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్రకటనను బిహార్ బీజేపీ నేత‌లు స్వాగ‌తించారు. బిహార్‌లో కూడా ఈ త‌రహా వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి నీర‌జ్ బాబు పేర్కొన్నారు. అయితే ఇది క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌ల‌ దృష్టి మ‌ర‌ల్చడానికి చేస్తున్న ప్ర‌యత్నాల‌ని, వీరంద‌రూ న‌కిలీ సనాతనీయులని RJD నేత మృత్యుంజ‌య్ తివారీ విమ‌ర్శించారు.

Similar News

News July 11, 2025

ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

image

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.

News July 11, 2025

మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

image

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

News July 11, 2025

బిజినెస్ అప్‌డేట్స్

image

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు