News August 7, 2024

క్యాబినెట్‌లో కీలక అంశాలపై చర్చ?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణంపై అనుసరించాల్సిన ప్రణాళిక, సాగునీటి ప్రాజెక్టులు, సిబ్బంది బదిలీలపై చర్చ సాగుతున్నట్లు సమాచారం. మరికాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Similar News

News March 29, 2026

ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

image

TG: ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు-2026’కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనంలో ప్రభుత్వం 15% కోత విధిస్తుంది. ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తుంది. ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ ఇది వర్తిస్తుంది. పేరెంట్స్‌ను పట్టించుకోని వారికి ఇది గుణపాఠం అని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని CM రేవంత్ వ్యాఖ్యానించారు.

News March 29, 2026

‘అగ్ర తాంబూలం’ ఇవ్వడం అంటే?

image

ఏవైనా కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో ఓ వ్యక్తికి లేదా వర్గాలకు అధిక ప్రాధాన్యం, గౌరవం ఇస్తున్నారని చెప్పే సందర్భంలో ‘అగ్ర తాంబూలం’ జాతీయాన్ని వాడతారు. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశారు. చివరలో శ్రీకృష్ణుడికి మొదటి తాంబూలం ఇచ్చి గౌరవించారు. ఆ ఘట్టం నుంచే అగ్ర తాంబూలం వాడుకలోకి వచ్చిందని భాషా నిపుణులు చెబుతుంటారు. ప్రతి వేడుకలోనూ ఆకువక్కలతో తాంబూలం ఇవ్వడం అందరికీ తెలిసిందే.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 29, 2026

KCR అందుకే అసెంబ్లీకి రావడం లేదు: రేవంత్

image

TG: BRS అధినేత KCR దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే ఎస్సీని స్పీకర్ చేసినట్లు CM రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు రావట్లేదని ధ్వజమెత్తారు. దొర బిడ్డనై ఉండి దళితుడి ముందు కింద కూర్చోవాలా? అనే అహంకారంతోనే రావట్లేదని ఆరోపించారు. అహంకారమో, వయసు మీద పడిందని ఆయన్ను కొన్ని విషయాల్లో వదిలేసినా సభకు వచ్చిన BRS నేతల తీరు సరిగా లేదని CM మండిపడ్డారు.