News September 17, 2024
జియో సేవల్లో అంతరాయం

ప్రముఖ టెలికం కంపెనీ జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్ సరిగా రాకపోవడంతో కాల్స్ కలవడం లేదని యూజర్లు సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు. ముంబైలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్లోనూ కాల్స్ కలుస్తున్నా వాయిస్ కట్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
Similar News
News October 26, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీలోని ఎయిమ్స్ మంగళగిరి 10 వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం 10రోజుల్లోగా దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్ను స్పీడ్ పోస్ట్ చేయాలి. కన్సల్టెంట్, సీనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్, బయో మెడికల్ ఇంజినీర్, శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: aiimsmangalagiri.edu.in
News October 26, 2025
గ్యాస్ గీజర్లు వాడుతున్నారా?

కర్ణాటకలోని బెట్టపురలో బాత్రూమ్లో గీజర్ నుంచి లీకైన LPG గ్యాస్ పీల్చడంతో అక్కాచెల్లెళ్లు గుల్ఫామ్, తాజ్ చనిపోయారు. అలాంటి గీజర్లు వాడే వారికి ఈ ఘటన ఒక వేకప్ కాల్ అని నిపుణులు అంటున్నారు. మీరు గ్యాస్ గీజర్లు వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ‘యూనిట్ను బాత్రూమ్లో కాకుండా బయటి ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేయించాలి. తరచూ గ్యాస్ లీకేజీలను చెక్ చేయాలి. వాడనప్పుడు ఆఫ్ చేయాలి’ అని సూచిస్తున్నారు.
News October 26, 2025
సోనియా రాష్ట్రాన్ని ఇస్తే BRS దోచుకుంది: కోమటిరెడ్డి

TG: సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే BRS నేతలు పదేళ్లు దోచుకుతిన్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ‘దోపిడీ భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న KCR మా అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి మాట్లాడాడు అంటే మా విజయం అక్కడే అర్థం అవుతుంది. నవీన్ రౌడీ అయితే గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయో BRS నేతలు బయటపెట్టాలి’ అని ప్రచారంలో డిమాండ్ చేశారు.


