News August 19, 2024

పరుగు ఆపిన వెంటనే ఇలా చేయొద్దు

image

చాలామంది జాగింగ్ లేదా రన్నింగ్ పూర్తి కాగానే వెంటనే కూలబడుతుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ‘పరిగెత్తిన తర్వాత శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి టైమ్ పడుతుంది. కాసేపు నెమ్మదిగా నడవడమో లేక నిల్చుని ఉండటమో చేయాలి. వెంటనే కూర్చుంటే కాళ్లలోకి రక్తం ఎక్కువ చేరి నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కోసారి మూర్ఛ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది’ అని వారు హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 21, 2025

మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

image

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.

News November 21, 2025

24 నుంచి కొత్త కార్యక్రమం

image

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.

News November 21, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>మెదక్<<>> ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 21 జూనియర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు NAC/NTC కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు 18- 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,000-రూ.23,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్:https://ddpdoo.gov.in/