News August 19, 2024

పరుగు ఆపిన వెంటనే ఇలా చేయొద్దు

image

చాలామంది జాగింగ్ లేదా రన్నింగ్ పూర్తి కాగానే వెంటనే కూలబడుతుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ‘పరిగెత్తిన తర్వాత శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి టైమ్ పడుతుంది. కాసేపు నెమ్మదిగా నడవడమో లేక నిల్చుని ఉండటమో చేయాలి. వెంటనే కూర్చుంటే కాళ్లలోకి రక్తం ఎక్కువ చేరి నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కోసారి మూర్ఛ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది’ అని వారు హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 26, 2025

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్ రావ‌డానికి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినదాని కన్నా కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. ఈ స్టేజిలో జాగ్రత్తలు తీసుకోకపోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి మందులు ఇవ్వకుండా ముందు డైట్ పాటించాల‌ని, వ్యాయామం చేయాల‌ని వైద్యులు సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.

News November 26, 2025

బెండ, టమాటా, వంగలో వైరస్ తెగుళ్ల నివారణ

image

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.

News November 26, 2025

భారత్ చెత్త రికార్డు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్‌లో రన్స్ పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్‌లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.