News September 12, 2024
ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తావా?: గాంధీ

TG: తనను బతకడానికి వచ్చావా అన్న BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘నేను 3 సార్లు MLAగా గెలిచా. నన్ను <<14083308>>బతకడానికి <<>>వచ్చావా? అని ఎలా అంటావు? నువ్వు కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చావు? బతకడానికి కాదా? 29 రాష్ట్రాల ప్రజలు ఉంటున్న ఈ ప్రాంతంలో జనం మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తావా?’ అని గాంధీ ప్రశ్నించారు. అరెస్టైన ఆయన్ను గచ్చిబౌలి PSకు పోలీసులు తరలించారు.
Similar News
News November 28, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

AP: తుఫాన్ కారణంగా రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు హోంమంత్రి అనిత సూచనలు చేశారు. సోమవారం వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.
News November 28, 2025
ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు: UP

ఆధార్ కార్డు విషయంలో అన్ని విభాగాలకు ఉత్తర్ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికెట్గా, ప్రూఫ్ ఆఫ్ బర్త్గా గుర్తించడానికి వీల్లేదని పేర్కొంది. ‘ఆధార్కు జనన ధ్రువీకరణ పత్రం జత చేయరు. కాబట్టి ఇకపై దానిని బర్త్ సర్టిఫికెట్గా గుర్తించేందుకు వీల్లేదు’ అని ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.
News November 28, 2025
శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.


