News January 24, 2025

పదే పదే వేడి చేసిన టీ తాగుతున్నారా?

image

చాలా మంది తమ రోజును టీతో ప్రారంభిస్తారు. కానీ పదే పదే వేడి చేసిన టీ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ టీలో రుచి మారి పోషకాలు తగ్గిపోతాయి. చాలాసేపు ఉడికించిన టీ తాగడం వల్ల కడుపు నొప్పి, పొత్తి కడుపువాపు రావచ్చు. చర్మంపై మొటిమలు కూడా ఏర్పడతాయి. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. డీహైడ్రేషన్ ఏర్పడి శరీర ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. టీ కాచిన 15 నిమిషాల్లోగా తాగడం ఉత్తమం.

Similar News

News October 15, 2025

మొక్కజొన్న: కోతకు ముందు ఈ జాగ్రత్తలు..

image

మనుషులతోపాటు కోళ్లు, పశువులకు ఆహారం ఉపయోగించే ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి. పంటను ఆశించే కాండం తొలుచు పురుగు, పేను బంక నివారణకు రైతులు పలు మందులను వాడుతుంటారు. అయితే కోత దగ్గర పడిన సమయంలో అనుమతికి మించి, సురక్షిత కాలాన్ని దాటి వాడటం మంచిది కాదు. వాడితే పంట ద్వారా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే పైన ఫొటోలో చూపినట్లుగా సురక్షిత కాలం, మోతాదును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News October 15, 2025

అమ్మానాన్నా.. ఎందుకిలా చేస్తున్నారు!

image

కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల ఇద్దరు కవలలను చంపేసింది. అనంతరం తానూ బిల్డింగ్‌పై నుంచి దూకి తనువు చాలించింది. ఇవాళ కోనసీమ(D) చిలకలపాడులో భర్త కామరాజు ఇద్దరు పిల్లలను చంపి, బలవన్మరణానికి పాల్పడ్డాడు.

News October 15, 2025

లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డికి స్వల్ప ఊరట

image

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.