News January 22, 2025

వింటర్‌లో వీటిని తినడం లేదా..?

image

చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలు కచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో నారింజ, నిమ్మకాయ రసం తాగాలి. అలాగే చిలగడ దుంపలు, సలాడ్లు, చియా సీడ్స్, బాదం, జీడిపప్పు తీసుకోవాలి. ఆకుకూరలు, క్యారెట్, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తినాలి. కొన్ని కూరగాయలు, పప్పులు, మాంసంతో చేసిన సూప్ తీసుకుంటే శరీరం వెచ్చబడుతుంది. పాలకూర, బచ్చలికూర తీసుకుంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.

Similar News

News February 8, 2025

‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించట్లేదు: పౌరసరఫరాలశాఖ

image

TG: ‘మీసేవ’ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు ‘మీసేవ’ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.

News February 8, 2025

మెటాలో 3,000 మందికి లేఆఫ్స్?

image

టెక్ దిగ్గజం మెటా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. జాబ్ కోల్పోయినవారికి సెవెరెన్స్ ప్యాకేజీ ఇస్తారని టాక్. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను మాత్రమే తొలగించనున్నట్లు మెటా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 8, 2025

ఢిల్లీలో AAPకు కాంగ్రెస్ దెబ్బ: రాజ్‌దీప్

image

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ AAPకు చాలా డ్యామేజ్ చేసిందని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన ఓట్లు బీజేపీ-ఆప్ ఓట్ల మధ్య వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉండేదన్నారు. 2022లో గోవాలో కాంగ్రెస్ ఇలాగే AAPకు డ్యామేజ్ చేసిందని గుర్తు చేశారు.

error: Content is protected !!