News August 27, 2024
జ్వరమొచ్చిందా?

AP, TGలో <<13948570>>డెంగ్యూ<<>> విజృంభిస్తోంది. ప్రతి 200 మందిలో 13 మందికి పాజిటివ్ వస్తోంది. దీంతో జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంగ్యూ పరీక్షలు చేయించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే 4-5 రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందంటున్నారు. డెంగ్యూకు కారణమైన టైగర్ దోమ నీటిలో పెరిగి, ఎక్కువగా పగటిపూట కుడుతుంది. చిన్నారులు వీటి బారినపడే అవకాశం ఎక్కువ కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి.
Similar News
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.
News January 8, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<
News January 8, 2026
పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.


