News August 27, 2024

జ్వరమొచ్చిందా?

image

AP, TGలో <<13948570>>డెంగ్యూ<<>> విజృంభిస్తోంది. ప్రతి 200 మందిలో 13 మందికి పాజిటివ్‌ వస్తోంది. దీంతో జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంగ్యూ పరీక్షలు చేయించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే 4-5 రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందంటున్నారు. డెంగ్యూకు కారణమైన టైగర్ దోమ నీటిలో పెరిగి, ఎక్కువగా పగటిపూట కుడుతుంది. చిన్నారులు వీటి బారినపడే అవకాశం ఎక్కువ కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి.

Similar News

News October 26, 2025

తుఫాన్: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

image

AP: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
* 27, 28 తేదీలు: తూ.గో, అన్నమయ్య, కడప జిల్లాలు
* 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలు
> కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. అటు మరిన్ని జిల్లాలకు హాలిడే ఇచ్చే అవకాశం ఉంది.

News October 26, 2025

పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

image

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.

News October 26, 2025

నిమిషాల్లోనే అదృష్టం మారి’పోయింది’!

image

మధ్యప్రదేశ్‌‌కు చెందిన వినోద్ డోంగ్లీ అనే నోటరీ లాయర్ కొన్ని నిమిషాలపాటు బిలియనీర్‌గా మారారు. తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే రూ.2,817 కోట్ల విలువైన 1,312 హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్లు కనిపించడంతో షాకయ్యాడు. ఇది నిజమే అని సంభ్రమాశ్చర్యంలో మునిగిపోగానే ఆ షేర్లన్నీ తన ఖాతాలోంచి మాయమైపోవడంతో కంగుతిన్నారు. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరగడంతో తన అదృష్టం కాసేపే అని నవ్వుకున్నారు.