News January 15, 2025
కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?

AP: సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమలోని జగ్గన్నతోటలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కనుమ రోజు ప్రభలను ఊరు దాటిస్తే మంచిదని స్థానికుల విశ్వాసం. కొన్ని వందల ఏళ్ల క్రితం జగ్గన్నతోటలోనే ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ప్రతి కనుమ రోజున వీటిని ఒకే చోట చేర్చుతారు. ఈ ప్రభలను తీసుకొచ్చే క్రమంలో యువకులు పొలాలు, వాగులు దాటుతూ ముందుకు సాగుతారు.
Similar News
News January 3, 2026
చెదపురుగులతో పంటకు నష్టం.. నివారణ ఎలా?

వ్యవసాయంలో పంట మొలక నుంచి కోత వరకు అన్ని దశల్లో చెదపురుగుల వల్ల 10 నుంచి 50 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ పురుగులు పంట మొక్కల వేర్లను, చెట్ల కాండాన్ని ఆశించి లోపలి మెత్తని భాగాన్ని తినడం వల్ల అవి వడలిపోయి, ఎండి చనిపోతుంటాయి. చల్కా ఎర్రమట్టి నేలల్లో, నీటి ఎద్దడి ఉన్న తోటల్లో వీటి ఉద్ధృతి ఎక్కువ. ఏ పంటలకు చెదల ముప్పు ఎక్కువ? వీటిని ఎలా నివారించాలో తెలుసుకునేందుకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 3, 2026
5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు

AP: ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో ఈ నెల 5 నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో 10.57 లక్షల మంది 17ఏళ్ల లోపు వారు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. నీట్, JEE పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని క్యాంపుల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లకు సూచించింది.
News January 3, 2026
పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.


