News January 15, 2025

కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?

image

AP: సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమలోని జగ్గన్నతోటలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కనుమ రోజు ప్రభలను ఊరు దాటిస్తే మంచిదని స్థానికుల విశ్వాసం. కొన్ని వందల ఏళ్ల క్రితం జగ్గన్నతోటలోనే ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ప్రతి కనుమ రోజున వీటిని ఒకే చోట చేర్చుతారు. ఈ ప్రభలను తీసుకొచ్చే క్రమంలో యువకులు పొలాలు, వాగులు దాటుతూ ముందుకు సాగుతారు.

Similar News

News October 31, 2025

ఇండియా విన్.. TDPపై YCP MLA సెటైర్లు

image

AP: ఉమెన్స్ వరల్డ్ కప్‌లో AUSను టీమ్ ఇండియా ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. యర్రగొండపాలెం YCP MLA చంద్రశేఖర్ మహిళల జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే TDPపై సెటైర్లు వేశారు. “ఎల్లో జట్టును మట్టికరిపించిన ఉమెన్ ఇన్ బ్లూకు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ‘డర్టీ ఎల్లో జట్టును’ కూడా రాజకీయ సమాధి చేయడానికి ‘మెన్ ఇన్ బ్లూ’ సిద్ధం” అని ట్వీట్ చేశారు. MLA తీరుపై TDP ఫాలోవర్స్ మండిపడుతున్నారు.

News October 31, 2025

అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్

image

MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని TG స్పీకర్ G ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.10 మంది MLAలకు నోటీసులివ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4గురి విచారణ ముగిసింది. SC విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరారు. నోటీసులకు స్పందించని ఇద్దరిపైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

News October 31, 2025

జెమీమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

తాజాగా ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో అద్భుత బ్యాటింగ్ జెమీమా రోడ్రిగ్స్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ముంబైలో 2000లో జన్మించిన జెమీమా చిన్నవయసులోనే బ్యాట్ చేతబట్టింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు కూడా ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ చివరికి క్రికెట్‌నే ఎంచుకొంది. 2017లో అండర్-19 వన్డే మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 202 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది.