News November 26, 2024
IPL ఎలా, ఎందుకు మొదలైందో తెలుసా?

2007 T20 WCలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రేజ్ చూసి ఇండియాలోనూ T20 టోర్నీ నిర్వహించాలని అప్పటి BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోదీ భావించారు. ఈ విషయాన్ని BCCI పెద్దలకు చెప్పారు. అనుకున్నదే తడవుగా టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభించారు. అలా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్కు లలిత్ మోదీ ఫస్ట్ కమిషనర్.
Similar News
News November 23, 2025
తీవ్ర అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా, ఆ తర్వాత 2 రోజుల్లో తుఫానుగా బలపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించింది.
News November 23, 2025
వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం.. IBSA నాయకులతో మోదీ

జొహనెస్బర్గ్లో జరుగుతున్న G20 సమ్మిట్లో IBSA (ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా) నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వాలకు IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. 40 దేశాల్లో విద్య, హెల్త్, మహిళా సాధికారతకు IBSA ఇస్తున్న మద్దతును ప్రశంసించారు.
News November 23, 2025
డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే ‘రైతన్నా.. మీకోసం’: జగన్

AP: రైతులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని చెప్పి ఎండమావులు చూపిస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతుల ఒంటి మీద చొక్కా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారని ఫైరయ్యారు. రైతుల కష్టాలు, బాధలపై చర్చ జరగకుండా చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం అని విమర్శించారు. 18 నెలల్లో రైతుల కోసం ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? అని జగన్ Xలో ప్రశ్నించారు.


