News January 6, 2025

25 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్న వారు ఎంతమందో తెలుసా?

image

దేశంలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి జీతాలు ఇలా ఉన్నాయి. ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల జీతం ఉన్నవారు 1.28 కోట్ల మంది. 10L నుంచి 15L వరకు ఉన్నవారు 50 లక్షలు, 15L – 20L జీతం ఉన్నవారు 19L మంది, 20L – 25L వారు 9 లక్షలు, 25 L నుంచి 50 L జీతం పొందుతున్నవారు 13 లక్షల మంది ఉన్నారు. ఇంతకీ మీరు ఏ స్లాబ్‌లో ఉన్నారు

Similar News

News November 27, 2025

హీరోయిన్ కూడా మారారా!

image

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.

News November 27, 2025

స్వెటర్లు ధరిస్తున్నారా?

image

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: చంద్రబాబు

image

AP: పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకూడదని, 2 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.