News January 6, 2025

25 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్న వారు ఎంతమందో తెలుసా?

image

దేశంలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి జీతాలు ఇలా ఉన్నాయి. ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల జీతం ఉన్నవారు 1.28 కోట్ల మంది. 10L నుంచి 15L వరకు ఉన్నవారు 50 లక్షలు, 15L – 20L జీతం ఉన్నవారు 19L మంది, 20L – 25L వారు 9 లక్షలు, 25 L నుంచి 50 L జీతం పొందుతున్నవారు 13 లక్షల మంది ఉన్నారు. ఇంతకీ మీరు ఏ స్లాబ్‌లో ఉన్నారు

Similar News

News January 23, 2025

భిక్షమేసిన వ్యక్తిపై కేసు నమోదు

image

MP ఇండోర్‌లో ఓ గుడి ముందు యాచకురాలికి భిక్షమేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం రుజువైతే కోర్టు అతడికి జైలు శిక్ష కానీ రూ.5 వేల ఫైన్ కానీ విధించనుంది. ఇండోర్‌ను బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా భిక్షాటనను నగరంలో బ్యాన్ చేశారు. కొందరు యాచకులకు ఇళ్లు ఉన్నా, తమ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా భిక్షమెత్తుకుంటున్నట్లు పోలీసులు గుర్తించడం విశేషం.

News January 23, 2025

‘గాంధీ తాత చెట్టు’ మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు

image

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణి నటించిన ‘గాంధీ తాత చెట్టు’పై సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మీతో పాటు ఉండిపోతుందని చెప్పారు. అహింస గురించి పదునైన కథను దర్శకురాలు పద్మ మల్లాది అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. చిన్నారి నేస్తం సుకృతి శక్తిమంతమైన ప్రదర్శనతో తనను గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ఈ కళాఖండాన్ని చూసి తీరాలని Xలో రాసుకొచ్చారు.

News January 23, 2025

బీసీ రిజర్వేషన్లు పెంచాలని సీఎంకు కవిత లేఖ

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు రిజర్వేషన్లు 42% పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని MLC కవిత విమర్శించారు. కులగణన వివరాలను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కుంటి సాకులతో తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను సహించబోదని హెచ్చరించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు.