News October 24, 2024
పైరసీ వల్ల వినోద రంగానికి ఎంత నష్టమో తెలుసా!

ఇంట్లో కూర్చొని పైరసీ సినిమాలు చూడడం వల్ల గత ఏడాది వినోద పరిశ్రమకు ₹22,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు నివేదికలు అంచనా వేశాయి. సగానికి పైగా భారతీయులు అక్రమంగా కంటెంట్ను యాక్సెస్ చేస్తున్నారని, అందులో 63% OTT కంటెంట్ను వీక్షిస్తున్నారని తేలింది. థియేటర్ల నుంచి ₹13,700 కోట్లు, OTTల నుంచి ₹8,700 కోట్ల విలువైన కంటెంట్ పైరసీ జరిగింది. ఇది కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కిచెబుతోంది.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.