News August 9, 2024
కనీసం 6 గంటలైనా నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?

రోజంతా అలుపెరగకుండా పనిచేసే మన అవయవాలకు నిద్రపోయినప్పుడే తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అందుకే కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఆ నిద్ర కూడా లేకపోతే డయాబెటిస్, హృద్రోగాలు, బీపీ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. డిప్రెషన్ ముప్పుతో పాటు అకాల మరణం పొంచి ఉంటుంది’ అని నేషనల్ స్లీప్ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ జేసీ సూరి హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 16, 2025
‘కొండగట్టు అంజన్న’కు అటవీ శాఖ నోటీసులు

TG: ‘కొండగట్టు ఆంజనేయ స్వామి’ గుడికి అటవీశాఖ నోటీసులివ్వడం వివాదంగా మారింది. ఇక్కడి 6 ఎకరాలు తమవని, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చే అధికారం తమకుందని అందులో పేర్కొంది. కాగా వేద పాఠశాల, వసతి, భోజనశాల అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. వాహన పూజలు, గిరి ప్రదక్షిణ దీనిలో సాగుతుంటాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని BJP చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.
News December 16, 2025
స్పిన్నర్కు భారీ ధర

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ జాక్పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్సోల్డ్గా మిగిలారు.
News December 16, 2025
పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదు: కేటీఆర్

TG: పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదని, అది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సొంత ఇళ్లు అమ్మి కాంగ్రెస్ నేతలు నిధులివ్వడం లేదని ఫైరయ్యారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను తెలంగాణ భవన్లో ఇవాళ కేటీఆర్ సన్మానించారు.


