News January 1, 2025
ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
శారీరక శ్రమ లేకుండా ఒక రోజులో పదిన్నర గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటే హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం 40 శాతం అధికంగా ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఇతరులతో పోలిస్తే హృద్రోగ సమస్యలు 54 శాతం ఎక్కువగా ఉంటాయని MIT-హార్వర్డ్ వర్సిటీ అధ్యయనం తెలిపింది. సగటున 62 ఏళ్ల వయసున్న 89,530 మందిపై స్టడీ చేసి ఈ వివరాలను వెల్లడించింది. కనీసం 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఈ ప్రమాదం కాస్త తగ్గుతుందని పేర్కొంది.
Similar News
News January 21, 2025
డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు: జనసేన
AP: మంత్రి నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.
News January 21, 2025
ముగిసిన KRMB సమావేశం
TG: హైదరాబాద్ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
News January 21, 2025
హైకోర్టులో మేరుగు నాగార్జునకు ఊరట
AP: వైసీపీ నేత మేరుగు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను లైంగికంగా వేధించడంతోపాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.