News December 6, 2024
మీ వద్ద రూ.2 వేల నోట్లు ఇంకా ఉన్నాయా!
₹2 వేలు విలువైన నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు RBI ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా 3.46 కోట్ల పెద్ద నోట్లు(₹6,920 Cr) చెలామణిలోనే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 2023లో ఉపసంహరణ ప్రకటన చేసే నాటికి 17,793 లక్షల నోట్లు చెలామణిలో ఉండగా, 2024 Nov నాటికి 17,447 లక్షల నోట్లు వెనక్కి వచ్చాయంది. RBIకి చెందిన 19 కేంద్రాల్లో వీటిని మార్చుకోవచ్చని, పోస్టు ద్వారా పంపవచ్చని తెలిపింది.
Similar News
News January 18, 2025
పూర్తిగా కోలుకున్న విశాల్
ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.
News January 18, 2025
ఎంపీతో రింకూ ఎంగేజ్మెంట్లో ట్విస్ట్!
రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.
News January 17, 2025
మహాకుంభమేళాలో శ్రీవారికి గంగా హారతి
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని దశాశ్వమేధ ఘాట్లో తిరుమల శ్రీవారికి గంగా హారతిని అర్చకులు సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల నడుమ శ్రీనివాసుడి ప్రతిమను ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.