News February 27, 2025

వేసవిలో ఎక్కువగా గుడ్లు, మామిడి తింటే వేడిచేస్తుందా?

image

రోజుకు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, వేసవిలో ఇలా చేస్తే వేడి చేస్తుందని కొందరు తినడం మానేస్తారు. అలాంటి వారికోసం వైద్యులు కీలక సూచనలు చేశారు. ‘వేసవిలో గుడ్లు, మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని చాలామంది భావిస్తారు. శక్తినిచ్చే ఏ ఆహారమైనా ఎక్కువ కేలరీస్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి అది అపోహ మాత్రమే. మనం వాటిని భేషుగ్గా తినొచ్చు’ అని సూచిస్తున్నారు.

Similar News

News March 27, 2025

పెరిగిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.89,840 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.

News March 27, 2025

రామ్ చరణ్‌కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

image

రామ్ చరణ్‌కు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘పెద్ది పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. నీలోని నటున్ని కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు ఇది కనుల పండుగ కానుందని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ Xలో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ NTRతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు విషెస్ తెలిపారు.

News March 27, 2025

2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

image

AP: CM చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

error: Content is protected !!