News November 14, 2024
ప్రధాని మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి డొమినికా తమ దేశంలోని అత్యున్నత పురస్కారం ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రకటించింది. కొవిడ్-19 సమయంలో తమ దేశానికి భారత్ నుంచి అందిన సాయానికి కృతజ్ఞతగా, ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు వివరించింది. వచ్చే వారం గయానాలోని జార్జ్ టౌన్లో జరిగే ఇండియా-కారికామ్ సదస్సులో డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనున్నారు.
Similar News
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.


