News December 18, 2024
భారత్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
US ప్రొడక్ట్స్పై భారత్ ఎక్కువ పన్నులు విధిస్తే తామూ అదే విధంగా బదులిస్తామని డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ‘వాళ్లెంత టారిఫ్స్ వేస్తే మేమూ అంతే వేస్తాం. భారత్ దాదాపుగా అన్నిటిపై పన్నులు వేస్తున్నా మనమలా చేయడం లేదు’ అని అన్నారు. చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్పై ప్రశ్నించగా భారత్, బ్రెజిల్ అధిక టారిఫ్స్పై ఆయన స్పందించారు. న్యూఢిల్లీ 100% టారిఫ్ వేస్తే తామెందుకు అలా చేయకూడదని ప్రశ్నించారు.
Similar News
News January 22, 2025
భారత్ పిచ్పై తేలిపోయిన RCB బ్యాటర్లు!
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
News January 22, 2025
GREAT: పొద్దున పోలీస్.. సాయంత్రం టీచర్
హరియాణాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అజయ్ గ్రేవాల్ రోజంతా ఉద్యోగం చేసి, సాయంత్రం ఉపాధ్యాయుడిగా మారుతారు. 2016 నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువకులకు ఉచితంగా UPSC, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నారు. ఇంటి టెర్రస్పైనే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఇప్పటివరకు ఆయన కోచింగ్ వల్ల 3వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు సమాచారం.
News January 22, 2025
BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి
తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.