News August 5, 2024
చదువు చెప్పిన కాలేజీకి రూ.228 కోట్ల విరాళం

APకి చెందిన వ్యాపారవేత్త కృష్ణా చివుకుల ఉదారత చాటుకున్నారు. తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన IIT మద్రాస్కు ₹228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. రేపు ఒప్పంద కార్యక్రమం జరగనుంది. బాపట్లకు చెందిన చివుకుల 1970లో ఏరోస్పేస్లో ఎంటెక్ పూర్తిచేశారు. న్యూయార్క్లో శివ టెక్నాలజీస్ కంపెనీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత బెంగళూరు, రేణిగుంటలోనూ సంస్థలను నెలకొల్పారు. ఈయన గతంలోనూ ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు.
Similar News
News March 3, 2026
క్రియేటర్లకు మద్దతుగా విజయసాయి ట్వీట్

సోషల్ మీడియా సంస్థలు క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయని మాజీ MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో 55% ఇస్తుండగా, ఇన్స్టాగ్రామ్ రూపాయి కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మన క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాలని, లేదంటే మన దేశానికే ‘భారత్ టాక్సీ’ తరహా సొంత ప్లాట్ఫామ్ ఉండాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. గతంలో క్రియేటర్లకు <<19248675>>మద్దతుగా<<>> అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.


