News March 12, 2025

రూ.2,200 కోట్లు దాటిన విరాళాలు: TTD ఛైర్మన్

image

AP: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ విరాళాలు రూ.2,200 కోట్లు దాటినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. 1985లో నాటి CM ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. నేడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. 9.7 లక్షల దాతలను ఈ ట్రస్ట్ కలిగి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రుచిగా, శుచిగా అన్నప్రసాద వితరణ చేస్తోందని చెప్పారు.

Similar News

News January 11, 2026

మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తాం: ఇరాన్

image

దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పదేపదే <<18824047>>బెదిరిస్తుండటంపై<<>> ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘అమెరికా మాపై అటాక్స్ చేస్తే ఈ రీజియన్‌లో ప్రతి US బేస్‌ను, ఇజ్రాయెల్‌ను లక్ష్యాలుగా చేసుకుంటాం’ అని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ బాకెర్ కాలిబాఫ్ హెచ్చరించారు. తాము నలువైపుల నుంచి శత్రువులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ‘అమెరికా నాశనమవ్వాలి’ అంటూ పార్లమెంటులో సభ్యులు నినాదాలు చేశారు.

News January 11, 2026

సంక్రాంతికి స్టాలిన్ కానుక.. రూ.3వేలు, చీర, ధోతి, బియ్యం, చక్కెర

image

తమిళనాడు ప్రజలకు స్టాలిన్ ప్రభుత్వం రూ.6,936 కోట్లతో సంక్రాంతి కానుకలు అందిస్తోంది. రేషన్ కార్డు ఉన్న 2.22 కోట్ల కుటుంబాలకు రూ.3వేలతో పాటు కేజీ బియ్యం, కేజీ చక్కెర, చెరకు గడ, చీర, ధోతి ఉచితంగా పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీ లేకుండా ముందే ఇంటింటికీ టోకెన్లు అందించారు. దాంట్లో ఉన్న తేదీ ప్రకారం జనవరి 12 వరకు దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. కాగా ఏపీ, టీజీలో ఇలాంటి స్కీమ్ లేదు.

News January 11, 2026

న్యూజిలాండ్ జట్టులో భారతీయుడు.. ఎవరీ ఆదిత్య?

image

INDతో జరుగుతున్న తొలివన్డేలో న్యూజిలాండ్ జట్టులో మరో భారతీయుడు చోటుదక్కించుకున్నారు. లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ 2002 సెప్టెంబర్ 5న వేలూరు(TN)లో పుట్టారు. అతడికి 4 ఏళ్ల వయసప్పుడే ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. 2023 ఆగస్టులో NZ తరఫున టీ20ల్లో, డిసెంబర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశారు. అప్పుడప్పుడూ భారత్‌కు వస్తుంటారు. CSK అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. రజినీకాంత్‌కు ఆదిత్య పెద్ద ఫ్యాన్.