News March 23, 2024
‘రివ్యూస్ రాస్తే డబ్బులు’.. ఇలాంటి ప్రకటనలు నమ్మకండి

TG: సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. రివ్యూస్ రాసే పార్ట్టైమ్ జాబ్ అంటూ హైదరాబాద్లో ఓ వ్యక్తిని నిలువునా ముంచేశారు. ఆన్లైన్లో బాధితుడికి పరిచయమైన మోసగాళ్లు.. హోటల్స్ను ప్రమోట్ చేయడంలో భాగంగా రివ్యూస్ రాస్తే డబ్బు ఇస్తామన్నారు. తొలుత పనికి తగ్గ డబ్బులు ఇస్తూ వచ్చారు. ఆపై మరింత పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని బాధితుడిని నమ్మించి రూ.13,57,288 దోచేశారు.
Similar News
News October 24, 2025
కార్తీక మాసంలో తినకూడని ఆహారం..

కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో ఉపవాస దీక్షతో పాటు కొన్ని ఆహార నియమాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన, దైవారాధనలకు అనుకూలంగా ఉండేలా ఆహారం తీసుకోవాలన్నారు. ‘ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, వంకాయ, ఆనపకాయ, మునగకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్దన్నము వంటి వాటిని తీసుకోరాదు. మినుములు, పెసలు, శెనగల, ఉలవలు, కందులు వంటి ధాన్యాలను కూడా ఉపయోగించకూడదు’ అని అంటున్నారు.
News October 24, 2025
అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి

ఇది రైతుల కష్టాల గురించి తెలిపే సామెత. అన్నదాతలు పండించిన పంటను అమ్మాలనుకుంటే కొనేవారు ఎవరూ ఉండరు. లేదా చాలా సందర్భాల్లో గిట్టుబాటు ధర లభించక తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంటుంది. కానీ అదే ధాన్యాన్ని రైతు కొనాలనుకుంటే మాత్రం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ పరిస్థితిని ‘అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి’గా చెబుతుంటారు. ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండటం నిజంగా బాధాకరం.
News October 24, 2025
నేటి నుంచి టెట్ దరఖాస్తులు!

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుందని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10న 9.30am-12pm వరకు సెషన్-1, 2.30-5pm వరకు సెషన్-2 పరీక్ష జరగనుంది. జనవరి 19న ఫలితాలు వెలువడనున్నాయి.
వెబ్సైట్: <


