News April 16, 2025
కోనోకార్పస్ చెట్లను నరకొద్దు: శాస్త్రవేత్తలు

కోనోకార్పస్ చెట్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని రక్షించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. అపోహలు నమ్మి చెట్లను నరకొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ చెట్లు అత్యధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయని YVU మాజీ VC ప్రొ.ఏఆర్ రెడ్డి తెలిపారు. తక్కువ నీరు, నిర్వహణ లేకుండానే ఈ మొక్కలు బతుకుతాయని, హైవేలపై విరివిగా నాటాలని సూచించారు. ఈ చెట్లు భూగర్భ జలాలను అత్యధికంగా తీసుకుంటాయనేది అవాస్తవమని చెప్పారు.
Similar News
News April 16, 2025
AI ఫొటో షేర్ చేసిన IAS స్మితకు పోలీసుల నోటీసులు

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు AIని ఉపయోగించి జింకలు, నెమళ్లు దీనస్థితిలో చూస్తున్నట్లు ఫొటోలు ఎడిట్ చేశారు. అందులో MAR 31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఫొటోను ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. తప్పుడు ఫొటోను షేర్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు.
News April 16, 2025
IPL జట్లకు BCCI అలర్ట్!

HYDకు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నట్లు BCCI గుర్తించిందని Cricbuzz పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి కార్యకలాపాల్లో భాగం చేయాలని అతడు చూస్తున్నాడని, జట్లన్నీ అప్రమత్తంగా ఉండాలని BCCI జట్లకు సూచించినట్లు తెలిపింది. సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం.
News April 16, 2025
సుప్రీంకోర్టు తదుపరి CJIగా గవాయ్

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానుండటంతో కొలీజియం గవాయ్ పేరును సిఫార్సు చేసింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం 52వ సీజేఐగా గవాయ్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు.