News September 21, 2024

రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.

Similar News

News November 11, 2025

RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

image

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <>https://rbi.org.in/<<>>లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డిసెంబర్ 6న ఫేజ్-2 ఎగ్జామ్ జరగనుంది. అందులోనూ సెలక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

News November 11, 2025

రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారా?

image

AFG క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. NEDలో జరిగిన ఈవెంట్‌లో రషీద్ ఓ అమ్మ‌ాయితో కనిపించగా ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై రషీద్ స్పందిస్తూ ‘2025 AUG 2న నా లైఫ్‌లో కొత్త చాప్టర్ మొదలైంది. ఈవెంట్‌లో నాతో ఉన్నది నా భార్యే’ అని తెలిపారు. కాగా 2024 OCTలోనూ రషీద్‌కు మ్యారేజ్ అయినట్లు వార్తలు రావడంతో ఇది రెండో పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News November 11, 2025

ఈ నెల 13 నుంచి అగ్రికల్చర్​ కోర్సు అడ్మిషన్లకు కౌన్సెలింగ్​

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో BSC ఆనర్స్​, అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు HYD రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని చెప్పారు. సైట్: www.pjtau.edu.in/