News September 21, 2024
రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.
Similar News
News December 10, 2025
GNT: సీఐపై నిందారోపణ కేసులో ట్విస్ట్

సీఐ తనపై దాడి చేయించారంటూ నిందలు మోపిన జర్నలిస్ట్ కన్నెగంటి అరుణ్ బాబు సహా మరో ఇద్దరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీలను పెట్టుకుని తన కారును తానే ధ్వంసం చేయించి, పోలీసులపై అబద్ధపు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. విజయవాడ బస్టాండ్ వద్ద అరుణ్ బాబు, పొంగులూరి అన్వేష్, కారుకుట్ల సుధీర్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 10, 2025
AP న్యూస్ రౌండప్

*58,204మంది అంగన్వాడీ వర్కర్లకు 5G ఫోన్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
*ఉచిత సివిల్స్ కోచింగ్కు మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 100మంది ఎంపిక: మంత్రి సవిత
*రైతుల నుంచి MSPకి కొన్న ప్రతి గింజను వేగంగా రైళ్లలో FCI గోదాములకు తరలిస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్(తెలుగు)- 2A పరీక్షకు 2 సెషన్స్లో కలిపి 17,181మంది అభ్యర్థులు హాజరు
News December 10, 2025
రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM

AP: ఆధునిక సాగు యంత్రాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంకు ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వాణిజ్య పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. ‘శాస్త్రీయ విధానంలో సాగు ప్రణాళిక, ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగంతో ఖర్చు తగ్గించాలి. ఓ వెబ్సైట్ ప్రారంభించి పరికరాల వివరాలు తెలియజేయాలి. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్ కిసాన్ యాప్లోని సమస్యలను CCI అధికారులు పరిష్కరించాలి’ అని ఆదేశించారు.


