News September 21, 2024

రాజకీయాలొద్దు.. చేతనైతే విచారణ చేయించండి: బొత్స

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో వేగంగా విచారణ జరిపి నిజాలు తేల్చాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవద్దు. చేతనైతే విచారణ జరిపించాలి, అంతేగాని రాజకీయం చేయవద్దు. దేవుడికి అపచారం చేస్తే ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ప్రజల మనోభావాలతో రాజకీయాలు సమంజసం కాదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అన్నారు.

Similar News

News December 12, 2025

సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు: కోమటిరెడ్డి

image

TG: కుటుంబాలతో కలిసి సినిమాలు చూడాలంటే టికెట్ ధరలు తక్కువుండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘మూవీ టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు, దర్శకులు మా దగ్గరికి రావొద్దు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నాం. ఈసారి పొరపాటు జరిగింది. హీరోలకు రూ.వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారు’ అని ప్రశ్నించారు. అఖండ-2 ప్రీమియర్స్ రేట్లు పెంపు జీవోని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.

News December 12, 2025

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు.. కారణం ఏమిటి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.

News December 12, 2025

భారత్ భారీ స్కోర్

image

మెన్స్ U-19 ఆసియా కప్-2025లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. UAEతో మ్యాచులో 50 ఓవర్లలో 433-6 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 171 రన్స్‌తో ఊచకోత కోశారు. ఆరోన్ జార్జ్ 69, విహాన్ మల్హోత్రా 69 పరుగులతో అదరగొట్టారు.