News March 3, 2025

DON’T MISS.. పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాల భర్తీ

image

21,413 పోస్టుల భర్తీ కోసం భారత తపాలా శాఖ స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు మార్చి 3వ తేదీతో ముగియనుంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(రూ.12,000-29,380), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(రూ.10,000-రూ.24,470) ఉద్యోగాలకు టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. APలో 1,215, TGలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 40 ఏళ్ల వారు అర్హులు. ఫీజు రూ.100. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News November 17, 2025

డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News November 17, 2025

డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News November 17, 2025

ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్‌లో మొబైళ్లు, కాన్పూర్‌లో సిమ్‌ల కొనుగోలు

image

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్‌లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్‌ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్‌తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్‌కు సోదరుడు.