News July 11, 2024

‘లోన్‌ యాప్‌’ ఫోన్ వస్తే భయపడొద్దు: పోలీసులు

image

యాప్స్ నుంచి లోన్ తీసుకున్న వారిని, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను ఏజెంట్ ఫోన్లు, మెసేజ్లతో వేధిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలంగాణ పోలీసులు తెలిపారు. అలా ఎవరైనా ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపినా ఆందోళనకు గురికావొద్దంటున్నారు. ఫోన్ చేసి వేధిస్తుంటే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సమీపంలోని PSలో ఫిర్యాదు చేసినా సరిపోతుందని చెబుతున్నారు. >> SHARE

Similar News

News October 18, 2025

కమ్యూనిటీ బయింగ్: 186 కార్లకు ₹21 కోట్ల డిస్కౌంట్!

image

షాపింగులో బల్క్‌గా కొంటే ఏమైనా తగ్గిస్తారా అని బేరమాడటం చూస్తుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యూనిటీ సభ్యులు దీనిని వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. ఏకంగా 186 లగ్జరీ కార్లను ఒకే డీల్‌లో కొనుగోలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ కార్ల విలువ ₹149.54 కోట్లు కాగా, వారు రూ.21.22 కోట్లు డిస్కౌంట్ పొందడం విశేషం. ఒకే కమ్యూనిటీకి చెందినవారు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి లగ్జరీ కార్లను కొనడం దేశంలోనే చర్చనీయాంశమైంది.

News October 18, 2025

బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

image

భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా $102 బిలియన్లు దాటినట్లు RBI డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం RBI విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7% కి చేరింది.

News October 18, 2025

రేపే తొలి వన్డే.. ట్రోఫీతో కెప్టెన్లు

image

భారత్ vs ఆసీస్ వన్డే సిరీస్ రేపు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కెప్టెన్లు గిల్, మార్ష్ ట్రోఫీ లాంచ్ చేసి ఫొటోలకు పోజులిచ్చారు. కెప్టెన్‌గా గిల్‌కిది తొలి వన్డే సిరీస్ కాగా, AUSలోని బౌన్సీ పిచ్‌‌లు తన సారథ్యానికి సవాలు విసరనున్నాయి. మరోవైపు అందరి దృష్టి RO-KOలపై ఉంది. వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునేందుకు ఈ సిరీస్ వారికి కీలకం అయ్యే ఛాన్సుంది. తొలి వన్డే రేపు పెర్త్‌ వేదికగా జరగనుంది.