News February 4, 2025
పోలవరం కెపాసిటీ తగ్గించొద్దు: మిథున్ రెడ్డి

AP: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవద్దని కేంద్రాన్ని YCP MP మిథున్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై లోక్సభలో ఆయన పాల్గొన్నారు. పోలవరంపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకు తగ్గించడంతో కెపాసిటీ 194 నుంచి 115 TMCలకు పడిపోతుందని వివరించారు. దీని వల్ల 4.2 లక్షల ఎకరాలకు నీరు అందదని, ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 30, 2026
రిటైర్మెంట్, పెన్షన్లను Gen Z నమ్మట్లే!

ఆర్థిక సవాళ్ల కారణంగా Gen Z(1997-2012) రిటైర్మెంట్ను ఒక ఆప్షన్గానూ భావించట్లేదు. పెన్షన్లపై నమ్మకం లేదని, జీవితాంతం పనిచేస్తూనే ఉండాల్సి వస్తుందని 12శాతం మంది యువత భావిస్తోంది. ఆర్థిక విషయాలపై అవగాహన లేకపోవడం, పెరుగుతున్న ఖర్చులే ఇందుకు కారణం. అయితే చిన్న వయసు నుంచే పొదుపు చేస్తే భారీ లాభం ఉంటుందని, నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News March 30, 2026
బంగ్లాదేశ్లో IPL టెలికాస్ట్ లేనట్లే

బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచుల ప్రసారం జరిగే అవకాశం లేదు. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం మ్యాచుల ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బ్రాడ్కాస్ట్ అగ్రిమెంట్ను జియో స్టార్ తాజాగా రద్దు చేసుకుంది. 2023-2027 వరకు ప్రసార హక్కులను తీసుకున్న బంగ్లా ఛానల్ ‘టీ స్పోర్ట్స్’ గడువులోగా పేమెంట్స్ చేయలేదు. దీంతో జియో స్టార్ ఒప్పందాన్ని రద్దు చేసింది. WPLకూ ఇది వర్తించనుంది.
News March 30, 2026
KCRను గృహ నిర్బంధం చేశారని నా అనుమానం: CM రేవంత్

TG: రావణుడి వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని, కేసీఆర్ ఉండటం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆయన లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని మీడియాతో చిట్చాట్లో తెలిపారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారని, కానీ తన అనుమానం ప్రకారం ఆయనను గృహ నిర్బంధం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.


