News February 4, 2025
పోలవరం కెపాసిటీ తగ్గించొద్దు: మిథున్ రెడ్డి
AP: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవద్దని కేంద్రాన్ని YCP MP మిథున్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై లోక్సభలో ఆయన పాల్గొన్నారు. పోలవరంపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకు తగ్గించడంతో కెపాసిటీ 194 నుంచి 115 TMCలకు పడిపోతుందని వివరించారు. దీని వల్ల 4.2 లక్షల ఎకరాలకు నీరు అందదని, ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 4, 2025
ఫోర్బ్స్ టాప్-10 దేశాల్లో ఇండియాకు నో ప్లేస్
ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కలేదు. నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు టాప్-10లో చోటు దక్కింది. భారత్ 12వ స్థానంలో ఉంది.
News February 4, 2025
రూ.3 కోట్లతో గర్ల్ఫ్రెండ్కు ఇల్లు కట్టించిన దొంగ
షోలాపూర్కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్కు రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి(37) మైనర్గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగిలించిన డబ్బుతో కోల్కతాలో రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం వెల్లడైంది.
News February 4, 2025
వన్డే జట్టులోకి మిస్టరీ స్పిన్నర్
ఇంగ్లండ్తో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని BCCI సెలక్ట్ చేసింది. 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన T20 సిరీస్లో వరుణ్ 7.66RRతో 14 వికెట్లు తీశారు. ఫామ్లో ఉన్న వరుణ్ ఈ సిరీస్లో రాణిస్తే CTకి సైతం ఎంపిక చేయాలని BCCI భావిస్తోంది. చక్రవర్తిని CTకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.