News March 18, 2025
కసాయి వాళ్లను నమ్మకండి.. బీసీ నేతలతో సీఎం

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టినందుకు బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘బీసీ కులగణన చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆయనకే. 10 లక్షల మందితో రాహుల్కు కృతజ్ఞత సభ పెట్టండి. సర్వేలో పాల్గొనని వారిని వెళ్లి కలుస్తున్నారు. ఆ కసాయి వాళ్లను నమ్మకండి’ అని సూచించారు.
Similar News
News March 19, 2025
₹2.4-₹3 లక్షల జీతంతో ఉద్యోగాలు: సీడాప్

AP: జర్మనీలో నర్స్ ఉద్యోగాల కోసం అర్హులైన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర స్కిల్& ట్రైనింగ్ డిపార్ట్మెంట్, సీడాప్ ఓ ప్రకటనలో తెలిపాయి. అభ్యర్థులకు BSc, MSc నర్సింగ్ చదివి, 20-35yrs వయసు, సాధారణ ఆస్పత్రుల్లో పని అనుభవం, జర్మనీ భాష నేర్చుకునేందుకు ఆసక్తి ఉండాలి. ఈనెల 24 నుంచి VJAలోని భవానీపురం సెంటర్లో తరగతులు ప్రారంభం అవుతాయి. జీతం నెలకు ₹2.4-₹3L ఇస్తారు.
వివరాలకు ఫోన్: 9963074879, 9492719843
News March 19, 2025
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. మెరిట్ జాబితాను <
News March 19, 2025
ఏప్రిల్ నుంచి ఎక్స్ట్రా చెల్లించాల్సిందే

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.