News October 3, 2024
గిఫ్టులు అక్కర్లేదు.. రైతులకు హక్కులు కావాలి: రాహుల్ గాంధీ

దేశంలోని రైతులు ఉచిత బహుమతులను కోరుకోవడం లేదని, వారి హక్కులను మాత్రమే కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ, అంబానీల రుణాలను మాఫీ చేసినప్పుడు, రైతులవి కూడా మాఫీ చేయాలన్నారు. హరియాణా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అదానీ పోర్టుల్లో వేల కిలోల డ్రగ్స్ దొరికినా మోదీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. హరియాణా పిల్లల భవిష్యత్తును అదానీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
Similar News
News March 29, 2026
KCR అందుకే అసెంబ్లీకి రావడం లేదు: రేవంత్

TG: BRS అధినేత KCR దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే ఎస్సీని స్పీకర్ చేసినట్లు CM రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు రావట్లేదని ధ్వజమెత్తారు. దొర బిడ్డనై ఉండి దళితుడి ముందు కింద కూర్చోవాలా? అనే అహంకారంతోనే రావట్లేదని ఆరోపించారు. అహంకారమో, వయసు మీద పడిందని ఆయన్ను కొన్ని విషయాల్లో వదిలేసినా సభకు వచ్చిన BRS నేతల తీరు సరిగా లేదని CM మండిపడ్డారు.
News March 29, 2026
రూ.12,000 కోట్ల ఆస్తి.. చివరికి

‘రేమండ్’తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన <<19504124>>విజయ్పత్ సింఘానియా<<>> జీవిత చరమాంకంలో అద్దె ఇంట్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2015లో ₹12K కోట్ల కంపెనీతోపాటు తన 37% వాటా(₹1,000 కోట్లు)ను కొడుకు గౌతమ్కు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన తండ్రిని పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో విజయ్ కోర్టుకెక్కారు. కొడుకును నమ్మి ఆస్తులు అప్పగించడం అతిపెద్ద తప్పు అని సింఘానియా గతంలో చెప్పారు.
News March 29, 2026
ఎన్టీఆర్, చిరు, PK బాటలోనే విజయ్!

TN అసెంబ్లీ ఎన్నికల్లో TVK అధినేత విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాటలోనే ఆయన నడుస్తున్నారని SMలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ TDPని స్థాపించి 1983లో గుడివాడ, తిరుపతి నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. చిరంజీవి(ప్రజారాజ్యం) 2009లో తిరుపతి(విజయం), పాలకొల్లులో(ఓటమి) పోటీ చేశారు. పవన్(జనసేన) 2019లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడారు.


