News June 12, 2024
పవర్ స్టార్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా

జనసేనాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను…’ అనే క్యాప్షన్తో ఈ పోస్టర్ను డైరెక్టర్ హరీశ్ శంకర్ అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్లో ‘సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే..’ అని రాసి ఉంది.
Similar News
News December 7, 2025
వాళ్లు నా లైఫ్లో ఉన్నందుకు ఆనందిస్తున్నా: ఆమిర్ ఖాన్

రీనా దత్తా, కిరణ్ రావుతో డైవర్స్ తీసుకుని భార్యాభర్తలుగా విడిపోయామే తప్పా మనుషులుగా కాదని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. వారంటే ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. ‘రీనాను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా. ఇద్దరం కలిసే లైఫ్లో ఎదిగాం. 2వ భార్య కిరణ్ అద్భుతమైన వ్యక్తి. ఆమె పేరెంట్స్ మేమంతా కుటుంబం. గర్ల్ ఫ్రెండ్ గౌరి అనుకోకుండా వచ్చిన అదృష్టం. వాళ్లు లైఫ్లో ఉన్నందుకు ఆనందిస్తున్నా’ అని చెప్పారు.
News December 7, 2025
పిల్లల్లో ఊబకాయాన్ని ఎలా తగ్గించాలంటే?

ప్రస్తుత కాలంలో చిన్నారుల్లో కూడా ఊబకాయం పెరుగుతోంది. దీనివల్ల వారికి భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే..మెరుగైన, పోషకాలతో నిండిన ఆహారాన్ని పిల్లలకు అందించడం చాలా మంచిది. ఆన్లైన్లో దొరికే అధిక కేలరీల ఫుడ్స్ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. పిల్లలకు రోజుకు అరగంటైనా శారీరక శ్రమ ఉండాలి. అలాగే వారు ఒత్తిడికి గురవకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారు.
News December 7, 2025
స్కూల్పై దాడి.. 43 మంది చిన్నారులు మృతి

సుడాన్లో ఆర్మీ, రెబల్స్(పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్లో ఉన్న కలోగిపై రెబల్స్ చేసిన డ్రోన్ దాడిలో 79 మంది మరణించారు. వీరిలో 43 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. రెబల్స్ తొలుత కిండర్గార్టెన్(స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ అటాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.


