News September 24, 2024
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

TG: మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించింది. ముందుగా రివర్ బెడ్లోని 1600 ఇళ్లను తొలగించనున్నట్లు సమాచారం. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించనుంది.
Similar News
News March 17, 2026
ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి: KTR

TG: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై KTR విమర్శలు గుప్పించారు. ‘ఎవరు, ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి? పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నవారా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న రైతులా? నెలకు రూ.2500 కోసం వేచి చూస్తున్న ఆడబిడ్డలా? బెనిఫిట్స్ అందని ఉద్యోగులు, పెన్షన్దారులు, పురుగుల అన్నం తింటున్న విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా’ అని ధ్వజమెత్తారు.
News March 17, 2026
ALERT: ఇలా చేస్తే అకౌంట్లలోకి రూ.6,000

TG: ఈ నెల 22న ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా <<19392898>>నిధులు<<>> విడుదల చేయనుంది. 2026 FEB 28లోపు కొత్త పట్టాదారు పాస్బుక్స్ పొందినవారు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సమర్పించాలి. అధికారులు పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. దాన్ని బట్టి ప్రభుత్వం రూ.6,000 ఖాతాల్లో జమ చేస్తుంది.
News March 17, 2026
చావు నుంచి క్షణాల్లో తప్పించుకున్న మొజ్తబా

ఇజ్రాయెల్ దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ సహా ఇతర కుటుంబీకులు, ఇరాన్ ఉన్నతాధికారులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ అటాక్ నుంచి ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్రుటిలో తప్పించుకున్నారంటూ ఆ దేశ అధికారులు మాట్లాడుకున్న ఆడియో లీకైనట్లు ‘టెలిగ్రాఫ్’ తెలిపింది. ఖమేనీ నివాసంపై మిస్సైల్ పడటానికి కొన్ని సెకన్ల ముందే మొజ్తబా గార్డెన్లోకి నడుచుకుంటూ వెళ్లడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని పేర్కొంది.


