News March 23, 2024

నిప్పుల కొలిమిలా రెంటచింతల

image

AP: పల్నాడు జిల్లా రెంటచింతలలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఏటా వేసవిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో రెంటచింతల ఒకటి.

Similar News

News February 11, 2025

అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్

image

అదానీ గ్రూప్‌పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్‌తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్‌కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్‌లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.

News February 11, 2025

సైఫ్‌కు ప్లాస్టిక్ కత్తి ఇచ్చిన కొడుకు.. ఎందుకంటే?

image

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన చిన్న కొడుకు జెహ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లలు బాగానే ఉన్నారు. దేవుడికి ధన్యవాదాలు. ‘మళ్లీ దొంగ ఇంట్లోకి వస్తాడేమో. ఇది మీ దగ్గర ఉంచుకోండి’ అని జెహ్ ఓ ప్లాస్టిక్ కత్తి ఇచ్చాడు. ‘అబ్బాను గీత కాపాడింది. అబ్బా నన్ను కాపాడాడు’ అని తను చెప్పాడు’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

News February 11, 2025

ఐదేళ్ల విధ్వంసంతో వెనకబడ్డాం: CM చంద్రబాబు

image

AP: గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. ‘సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. ఆరు నెలల పాలనలో 12.94% వృద్ధిరేటు కనబడింది. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలి. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM అన్నారు.

error: Content is protected !!