News August 14, 2024

APలో ‘డబుల్ ఇస్మార్ట్’ టికెట్ ధరల పెంపు

image

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. రేపు విడుదల కానున్న ఈ మూవీకి టికెట్ రేట్లను రూ.35కు పైగా పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. పూరీ జగన్నాథ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపింది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ రేట్లు ఉండనున్నాయి.

Similar News

News November 20, 2025

అమలాపురం: కిడ్నాప్ కథలో ట్విస్ట్.. చివరికి అరెస్ట్..!

image

అమలాపురంలో కలకలం రేపిన పదేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడు మట్టపర్తి దుర్గా నాగసత్యమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బాలికకు వరుసకు మామయ్య అయిన సత్యమూర్తి ఈ నెల 10న పాపను బైక్‌పై తీసుకెళ్లి, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు డిమాండ్ చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. బాలిక తండ్రి కముజు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.

News November 20, 2025

ఆవులతో డెయిరీఫామ్ ఎందుకు మేలంటే?

image

హోలిస్టిన్ ఫ్రీజియన్ జాతి ఆవులు ఒక ఈతకు 3000 నుంచి 3500 లీటర్ల పాలను ఇస్తాయి. వీటి పాలలో వెన్నశాతం 3.5-4% ఉంటుంది. జెర్సీ జాతి ఆవు ఒక ఈతకు 2500 లీటర్ల పాలనిస్తుంది. పాలలో వెన్నశాతం 4-5% ఉంటుంది. ఒక ఆవు ఏడాదికి ఒక దూడను ఇస్తూ.. మనం సరైన దాణా, జాగ్రత్తలు తీసుకుంటే 10 నెలలు కచ్చితంగా పాలిస్తుంది. ఒక ఆవు రోజుకు కనీసం 12-13 లీటర్లు పాలిస్తుంది కనుక పాడి రైతుకు ఏడాదిలో ఎక్కువ కాలం ఆదాయం వస్తుంది.

News November 20, 2025

తప్పుల సవరణకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

image

TG: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో <<18333411>>తప్పులు<<>> ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని SEC పేర్కొంది. 23న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకొని తప్పులుంటే GPలో సంప్రదించాలి.