News January 24, 2025
రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్కు ఫోన్ చేయండి

APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News December 10, 2025
BDLలో 80 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్<
News December 10, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్

⋆ డైరెక్టర్ సుకుమార్ హానెస్ట్, ట్రాన్స్పరెంట్గా ఉంటారని హీరోయిన్ కృతిసనన్ ప్రశంసలు
⋆ ‘అఖండ-2’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో తమ ‘మోగ్లీ’ సినిమా విడుదలను DEC 12 నుంచి 13కి వాయిదా వేసినట్లు ప్రకటించిన డైరెక్టర్ సందీప్ రాజ్
⋆ ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపుపై మరో GO జారీ చేసిన AP ప్రభుత్వం.. 11న ప్రీమియర్ల టికెట్ ధర ₹600, 12వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్లలో ₹75, మల్టీప్లెక్స్లలో ₹100 చొప్పున పెంపు
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


