News March 18, 2024
పోలీసుల తీరుపై అనుమానాలున్నాయి: నాదెండ్ల
AP: బొప్పూడిలో నిన్న జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘దేశ ప్రధాని హాజరైన ప్రజాగళం సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలెక్టర్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేర్లు, ఫొటోలు లేకుండానే ఇష్టారీతిన పాస్లు జారీ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.
Similar News
News September 30, 2024
DSC ఫలితాలు.. ఇక్కడ క్లిక్ చేయండి
TG: సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ-2024 ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు ఇక్కడ <
News September 30, 2024
GET READY: ‘రా మచ్చా మచ్చా’ వచ్చేది అప్పుడే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ప్రోమో సంగీత ప్రియులకు నచ్చేసింది.
News September 30, 2024
గ్రేట్.. కొండపై ఔషద మొక్కలు పెంచుతున్నాడు!
ఒడిశాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు పుపున్ సాహూను అభినందిస్తూ ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ యువ వడ్రంగి ప్రకృతి పరిరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నయాగఢ్లోని కుసుమి నది నుంచి నీటిని తీసుకొచ్చి ఎంతో క్లిష్టతరమైన కొండ ప్రాంతంలో 800కు పైగా ఔషధ, వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు. ఈయన రియల్ లోకల్ ఛాంపియన్’ అని ఆయన కొనియాడారు.