News April 14, 2025
రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

గుజరాత్ తీరంలో 300KGల డ్రగ్స్ను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ ₹1,800Cr ఉంటుందని అంచనా. ఈ నెల 12-13న రాత్రి అనుమానాస్పద బోట్ కనిపించడంతో అధికారులు అక్కడికెళ్లారు. దీంతో దుండగులు డ్రగ్స్ మూటలను సముద్రంలో పడేసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది నీళ్లలో మునిగిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ATS, నేవీ దళం సంయుక్త ఆపరేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 2, 2025
క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి?

క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమికి ముందు వస్తుంది. ఈరోజున విష్ణువు బృందావనంలోకి (తులసి కోటలోకి) అడుగుపెడతారు. అందుకే వ్రతం ఆచరించే వారు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. తులసి కోటకు సమీపంలో విష్ణువు (లేదా) కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజించడం శ్రేష్ఠం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి.
News November 2, 2025
ఇంటర్వ్యూతో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని బ్రిక్ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్(<
News November 2, 2025
IAS అకాడమీల తప్పుడు ప్రచారాలు.. భారీ జరిమానా

UPSCలో అభ్యర్థుల విజయాలను తమ ఘనతగా చెప్పుకున్న ఢిల్లీలోని రెండు IAS కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కొరఢా ఝళిపించింది. ఒక్కో సంస్థకు ₹8L చొప్పున ఫైన్ విధించింది. తాను కేవలం ఒక్క ఇంటర్వ్యూకు హాజరైతే క్రెడిట్ను దీక్షంత్ సంస్థ తమ ఖాతాలో వేసుకుందని 2021లో సివిల్స్ విజేత మణిశుక్లా ఫిర్యాదు చేశారు. అలాగే తన అనుమతి లేకుండా ఫొటో వాడిందంటూ అభిమను అకాడమీపై నటాష ఫిర్యాదు చేశారు.


