News June 29, 2024
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

TG: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని CS శాంతికుమారిని సీఎం సూచించారు. రేపు డీఎస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డి.శ్రీనివాస్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
Similar News
News December 25, 2025
1.07 లక్షల మందికి స్కాలర్షిప్

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో చదువుకుంటున్న బాలికల స్కాలర్షిప్ల కోసం సమగ్రశిక్ష రూ.10.70 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను రూ.1,000 చొప్పున విద్యార్థినుల పేరెంట్స్ ఖాతాల్లో జమ చేసింది. కేజీబీవీల్లో 1.07 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారు. నిధుల విడుదలతో వారందరికీ ఊరట కలగనుంది.
News December 25, 2025
తెగుళ్ల నుంచి పంట సహజ రక్షణకు సూచనలు

ఏటా అదే భూమిలో ఒకే రకం పంటను వేయకుండా.. పెసర, మినప, అలసంద, మొక్కజొన్న, బంతి వంటి పంటలతో పంటమార్పిడి చేయాలి. ఒకే పంట సాగు వల్ల గత పంటను ఆశించిన చీడపీడలు, తిరిగి కొత్తగా నాటిన అదే పంటను ఆశించి నష్టపరుస్తాయి. పంట మార్పిడి వల్ల ఈ ప్రమాదం తప్పుతుంది. విత్తడానికి ముందు సాగు భూమిని బాగా దుక్కి చేసి ఉంచితే సూర్యరశ్మి వల్ల భూమిలో దాగిన శిలీంధ్రాలు, హానికలిగించే పురుగుల ప్యూపాలు నశిస్తాయి.
News December 25, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 పెరిగి రూ.1,39,250కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 ఎగబాకి రూ.1,27,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.2,45,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


