News June 29, 2024
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

TG: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని CS శాంతికుమారిని సీఎం సూచించారు. రేపు డీఎస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డి.శ్రీనివాస్ మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
Similar News
News November 26, 2025
జూన్-జులై మధ్య గోదావరి పుష్కరాలు?

AP: గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26-జులై 7 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వేదపండితులతో దేవదాయ శాఖ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై CM CBN త్వరలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నాయి. చివరిసారి 2015లో గోదావరి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే.
News November 26, 2025
NPCILలో 122 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, PG, PG డిప్లొమా, MBA, BE, B.Tech, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.56,100, Jr ట్రాన్స్లేటర్కు రూ.35,400 చెల్లిస్తారు. npcilcareers.co.in
News November 26, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేట్ రూ.870 ఎగబాకి రూ.1,27,910కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,17,250గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.2వేలు పెరిగి రూ.1,76,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.


