News July 16, 2024
ఎల్లుండి నుంచి డీఎస్సీ పరీక్షలు

TG: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజూ 26 వేల మందికి చొప్పున రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
Similar News
News November 16, 2025
iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

iBOMMA, BAPPAM సైట్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ అవ్వడం లేదు. iBOMMA సైట్లో 1XBet అనే <<18296786>>బెట్టింగ్<<>>, ఆన్లైన్ గేమింగ్ యాప్ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించడం అతడి ప్లాన్ అని, ఇందుకోసం బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2025
నేను 2 గంటలే నిద్రపోతా: జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రోజూ రాత్రి కేవలం 2 గంటలు, మహా అయితే 4 గంటలు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. ఈ అలవాటు తన స్కిన్కు చేటు చేస్తుందని అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల కోసం అధికారులతో 3am వరకు మీటింగ్ పెట్టడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. జపాన్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగా లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<


