News July 16, 2024

ఎల్లుండి నుంచి డీఎస్సీ పరీక్షలు

image

TG: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజూ 26 వేల మందికి చొప్పున రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Similar News

News November 13, 2025

సాయిబాబాను ఎలా పూజించాలి?

image

సాయిబాబా పూజలో కఠిన నియమాలేం ఉండవు. ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇతరులను దూషించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆయన పూజలో భక్తే ప్రధానం. భక్తి లేని ఘనమైన పూజ కంటే, భక్తితో సమర్పించే ఓ పువ్వు కూడా బాబాకు సంతోషాన్నిస్తుంది. బాబాకు మన మనసనే పుష్పాన్ని సమర్పించినా చాలు. ఆయన పేరు తలచి, దానధర్మాలు చేస్తే సాయినాధుని అనుగ్రహం భక్తులపై తప్పక ఉంటుందట. <<-se>>#Pooja<<>>

News November 13, 2025

ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

image

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.

News November 13, 2025

రేపటి కోసం..

image

జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం రేపటి కోసం ఎదురు చూస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలుకానుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది EVMలు తేల్చనున్నాయి. అటు బిహార్‌లోనూ రేపు ఓట్ల లెక్కింపు జరగనుండగా ఫలితాలపై ఆ రాష్ట్రంతో పాటు దేశ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.