News July 16, 2024
ఎల్లుండి నుంచి డీఎస్సీ పరీక్షలు

TG: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజూ 26 వేల మందికి చొప్పున రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
Similar News
News November 18, 2025
కొచ్చిన్ షిప్యార్డ్లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.
News November 18, 2025
కొచ్చిన్ షిప్యార్డ్లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.
News November 18, 2025
నేడు కృష్ణాంగారక చతుర్దశి

ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని ‘కృష్ణ అంగారక చతుర్దశి’ అని అంటారు. ఈ పవిత్ర దినానికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందట. గ్రహణం రోజున చేసే పూజలు, దానధర్మాలు అద్భుత ఫలితాలు ఇచ్చినట్లే, ఈరోజున కూడా కొన్ని ప్రత్యేక కార్యాలు చేస్తే శుభ ఫలితాలు, అదృష్టం పొందవచ్చని నమ్మకం. నేడు శివారాధన, గణపతి పూజలు చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు.


