News March 30, 2024
ఎన్నికల తర్వాతే డీఎస్సీ, టెట్ ఫలితాలు: ఈసీ

AP: ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.
Similar News
News February 1, 2026
బ్యాంకింగ్ రంగ పటిష్ఠానికి ఉన్నతస్థాయి కమిటీ

బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేలా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ‘ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు హెల్తీ బ్యాలెన్స్ షీట్లు, లాభాలతో మెరుగ్గా ఉన్నాయి. మొండి రుణాలపై నియంత్రణతో ఉన్నాయి. మరింత మెరుగైన రీతిలో వీటిని పటిష్ఠం చేసేందుకు, సంస్కరణల అమలుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తుంది. తదుపరి ఎకనమిక్ గ్రోత్ సాధనకు ఇది దోహదపడుతుంది’ అని వివరించారు.
News February 1, 2026
సాఫ్ట్వేర్ రంగానికి ఊరట: ట్యాక్స్ రూల్స్లో బిగ్ అప్డేట్!

IT, సాఫ్ట్వేర్ రంగంలో పన్నుల గందరగోళానికి చెక్ పెడుతూ నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. IT, ITeS, KPO, కాంట్రాక్ట్ R&D సేవలను విడివిడిగా కాకుండా వాటన్నింటినీ కలిపి IT సర్వీసెస్ అనే ఒకే కేటగిరీగా గుర్తిస్తారు. వీటన్నింటికీ ఒకే ‘Safe Harbour Framework’ వర్తించడం వల్ల ట్యాక్స్ రూల్స్ సింపుల్గా మారతాయి. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది.
News February 1, 2026
పాక్తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
IND: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(C), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్


