News March 30, 2024

ఎన్నికల తర్వాతే డీఎస్సీ, టెట్ ఫలితాలు: ఈసీ

image

AP: ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.

Similar News

News February 9, 2026

T20WC: చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్

image

T20WC-2026లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇటలీతో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 207/4 స్కోర్ చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో 200+ రన్స్ చేసిన తొలి అసోసియేట్ టీమ్‌(టెస్టు హోదా లేని జట్టు)గా చరిత్ర సృష్టించింది. గతంలో USA 197/3(vsCAN), CAN 194/5(vsUSA), NED 193/4(vsIRE) స్కోర్ చేశాయి. ఇక ఈ మ్యాచ్‌లో జార్జ్ మున్సే 84(54 B), బ్రెండన్ మెక్‌ముల్లెన్ 41(18 B), మైఖేల్ లీస్క్ 22(5 B) అదరగొట్టారు.

News February 9, 2026

మాఘ స్నానం ఇంకా చేయలేదా?

image

మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో నదీ స్నానాలు చేయాలంటారు. ఒకవేళ చేయలేకపోతే చివరి రోజు ఓ పరిహారం పాటించాలంటున్నారు పండితులు. అలా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ‘ఇంట్లో ప్రతికూల శక్తి పోవాలంటే కర్పూరంలో 11 లవంగాలు వేయాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా చూపాలి. ఆర్థిక ఇబ్బందుల తొలగింపునకు తమలపాకుపై కుంకుమపువ్వుతో ‘శ్రీ’ అని రాసి పూజ గదిలో ఉంచాలి. భార్యాభర్తలు దీపారాధన చేయాలి’ అని సూచిస్తున్నారు.

News February 9, 2026

రూ.3వేల కోట్లతో రోడ్ల నిర్మాణం: సీఎం

image

AP: వచ్చే మూడేళ్లలో అమరావతిని మోస్ట్ లివబుల్ సిటీగా మారుస్తామని సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో అన్నారు. పోలవరాన్ని 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీతో 16వేల టీచర్ ఉద్యోగాలు, 5వేల కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశామన్నారు. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశామని, మరో రూ.3వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు.