News September 20, 2024
కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్

TG: సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలోని 25 వేల మందికి రూ.5,000 ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. దసరా పండగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందించనున్నట్లు చెప్పారు. అటు 41వేల మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులకు బోనస్ కింద ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు అందనున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది రూ.20వేలు బోనస్ అదనంగా అందుతోంది.
Similar News
News December 5, 2025
మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <


