News April 5, 2024
ఫొటోలు షేర్ చేస్తూ నెలకు రూ.17 లక్షలు సంపాదిస్తోంది!

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ లక్షలు సంపాదిస్తుంటారు. ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన లిల్లీ రైన్.. సోషల్ మీడియాలో తన ప్రయాణ ఫొటోలు షేర్ చేస్తూ నెలకు 20వేల డాలర్లు (రూ.17 లక్షలు) సంపాదిస్తోంది. అయితే ఆమె మనిషి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు. కానీ, ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆమె అందానికి, ట్రావెల్ ఫొటోలకు ముగ్ధులై లక్షల మంది ఫాలో అవుతున్నారు.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.