News August 26, 2024

భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్న

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని MLC తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా నిన్న హనుమకొండలో బీసీల శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ‘రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరు. తెలంగాణలో BC సర్కార్ రాబోతోంది. BCలను గెలిపించేలా KCRకు వినతి ఇచ్చేందుకైనా నేను వస్తా. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుంది’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.

Similar News

News October 23, 2025

ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

image

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్‌పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.

News October 23, 2025

కేసీఆర్‌పై MP మల్లు రవి ఆగ్రహం

image

TG: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను BRS చీఫ్ KCR <<18084451>>రౌడీ షీటర్‌<<>> అనడంపై MP మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘BC బిడ్డను రౌడీ షీటర్ అని అవమానిస్తారా? నవీన్ యాదవ్ మంచి విద్యావంతులు, పేదలకు సాయం చేసే గుణమున్నవాడు. ఆయనపై మీ అగ్రవర్ణ అహంకారాన్ని చూపిస్తారా. కేసీఆర్ బీసీలందరినీ అవమానించినట్లే. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు.

News October 23, 2025

ఇంటర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్‌ఫండ్ ఫీజు వసూలు

image

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు రూ.220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున మొత్తం రూ.235 కలెక్ట్ చేయాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. వసూలు చేసిన మొత్తాన్ని ఈనెల 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించింది.