News August 26, 2024

భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్న

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని MLC తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా నిన్న హనుమకొండలో బీసీల శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ‘రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరు. తెలంగాణలో BC సర్కార్ రాబోతోంది. BCలను గెలిపించేలా KCRకు వినతి ఇచ్చేందుకైనా నేను వస్తా. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుంది’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.

Similar News

News April 12, 2026

చేపను ఇవ్వడం కాదు పట్టడం నేర్పాలి.. ఏమంటారు?

image

దేశంలో ఉచిత పథకాల వల్ల ప్రజలు బద్ధకస్థులు అవుతున్నారని, వాటిని రద్దు చేయాలని కొంతమంది ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం అదే మాట చెప్పారు. ‘ప్రభుత్వం ఉచితాలు రద్దు చేసి విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేసినప్పుడు వాటి బడ్జెట్ ఎంత? ఎలా నిధులు సమకూరుస్తారు? అని ప్రజలు అడగాలి’ అని ఓ కార్యక్రమంలో అన్నారు.

News April 12, 2026

11AMకు ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

TG: ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రిజల్ట్స్ ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఉ.11 గం.కు ప్రభుత్వ సలహాదారు K.కేశవరావు ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. Way2Newsలో అత్యంత వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఎలాంటి యాడ్స్ లేకుండా క్షణాల్లో మార్కులు వచ్చేస్తాయి. వాటిని ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.

News April 12, 2026

మార్నింగ్ నుంచి హుషారుగా ఉండాలంటే..

image

*నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
*రోజూ 20-30 ని.ల పాటు యోగా, వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
*పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకుంటే శక్తి లభిస్తుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఎండలో కాసేపు గడపడం వల్ల విటమిన్ D అందుతుంది.
*పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి.