News December 10, 2024

రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

image

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.

Similar News

News February 5, 2026

చరిత్రలో తొలిసారి.. తగ్గుతున్న జెన్‌జీల IQ

image

జెన్‌జీలు తెలివితేటల్లో వెనకపడిపోతున్నట్లు న్యూరో సైంటిస్ట్ డాక్టర్ హార్వత్ పరిశోధనలో వెల్లడైంది. దీని ప్రకారం చరిత్రలో మునుపటి తరం కంటే తక్కువ IQ నమోదైన తొలి తరం ఇదేనని తెలిపారు. దీనికి ప్రధాన కారణం విద్యా రంగంలో మితిమీరిన టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్‌ల వాడకమని హెచ్చరించారు. పుస్తక పఠనం తగ్గడం, ఏఐ సమాధానాలపై ఆధారపడటం వల్ల వారి ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి దెబ్బతింటున్నాయని ఆయన వివరించారు.

News February 5, 2026

భారత్.. ప్రపంచానికి ఆశాకిరణం: మోదీ

image

ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇండియా ఆశాకిరణంగా మారిందని PM మోదీ అన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్యంలోకి వెళ్తున్నాయి. కానీ భారత్ యవ్వనంలోకి వస్తోంది. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన దగ్గరే ఉన్నాయి. గ్లోబల్ సౌత్ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. గ్లోబల్ సౌత్ గొంతుక ఇండియా’ అని అన్నారు. గతంలో మనతో డీల్స్ చేసుకునేందుకు ఏ దేశమూ రెడీగా లేదని పరోక్షంగా కాంగ్రెస్‌ పాలనను విమర్శించారు.

News February 5, 2026

NIMHANS 52పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>NIMHANS<<>> 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(మాలిక్యులార్ బయాలజీ), డిగ్రీ, డిప్లొమా(క్లినికల్ న్యూరో సైకాలజీ టెక్నాలజీ), MLSc, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nimhans.ac.in