News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News January 26, 2026
మంచు మనోజ్ భయంకరమైన లుక్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భయంకరమైన లుక్లో దర్శనమిచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నాలోని సరికొత్త కోణం. క్రూరమైన, క్షమించలేని’ అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానుంది.
News January 26, 2026
యాసిడ్ దాడి నుంచి పద్మశ్రీ వరకూ!

కేంద్రం ప్రకటించిన ‘పద్మశ్రీ’ అవార్డుల జాబితాలో యాసిడ్ దాడి బాధితురాలు ప్రొఫెసర్ మంగళ కపూర్(UP) కూడా ఉన్నారు. 12 ఏళ్లకే యాసిడ్ దాడికి గురై 37 సర్జరీలు చేయించుకున్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. సంగీతాన్నే శ్వాసగా మార్చుకుని PhD సాధించి 3 దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్నారు. గ్వాలియర్ ఘరానా శాస్త్రీయ సంగీతంలో ఆమె చేసిన కృషి అద్వితీయం. గాయాల నుంచి గెలుపు వైపు సాగిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.
News January 26, 2026
పనిమనిషిపై పదేళ్లుగా రేప్.. ధురంధర్ నటుడి అరెస్ట్

బాలీవుడ్ యాక్టర్ నదీమ్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10సం.లుగా రేప్కు పాల్పడ్డారని అతడి ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక, మానసిక వేధింపులకు గురైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదని పేర్కొంది. దీంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. మిమి, వాధ్, మై లడేగా తదితర మూవీల్లో నటించిన అతడు ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా వంటమనిషి అఖ్లాక్గా నటించారు.


