News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News January 15, 2026
మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. * వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్ చల్లితే దోమల బెడద తగ్గుతుంది. * కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది. * అన్నం విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి. * చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.
News January 15, 2026
పిండివంటలతో ఇంటింటా ఘుమఘుమలు

సంక్రాంతి పండుగ అనగానే కోడి పందేలు, గొబ్బెమ్మలతో పాటు ఘుమఘుమలాడే పిండివంటలు గుర్తొస్తాయి. సొంతూళ్లకు వచ్చిన పిల్లలు, అల్లుళ్లు, మనవళ్ల కోసం ఇళ్లలో అరిసెలు, సకినాలు, మురుకులు, గారెలు, సున్నుండలు వంటి వంటకాలను తయారు చేస్తారు. బెల్లం, నువ్వులు, బియ్యం పిండితో చేసిన తీపి వంటకాలతో పాటు కారపూస, చెక్కలు వంటి కారం వంటకాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఇంతకీ మీకు నచ్చిన పిండి వంటకం ఏంటి. COMMENT చేయండి.
News January 15, 2026
కోల్ ఇండియా లిమిటెడ్లో 125 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కోల్ ఇండియా లిమిటెడ్లో 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఎగ్జామ్ లేదు. కేవలం విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.coalindia.in/


