News December 10, 2024

రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

image

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.

Similar News

News January 30, 2026

విమాన ప్రమాదం.. పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో..

image

మహారాష్ట్ర Dy.CM <<18990751>>అజిత్ పవార్<<>> విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్లైట్ నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్‌ వేరే పైలట్ స్థానంలో వచ్చినట్లు అతని ఫ్రెండ్స్ తెలిపారు. ‘కొన్ని రోజుల క్రితమే సుమిత్ హాంగ్‌కాంగ్ నుంచి వచ్చారు. పవార్‌ను బారామతి తీసుకెళ్లాల్సిన పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కొన్ని గంటల ముందే సుమిత్‌కు ఆ బాధ్యత అప్పగించారు’ అని పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

News January 30, 2026

రూ.లక్ష జీతంతో ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ఐఐటీ <<>>ఢిల్లీ 4 ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజినీర్/సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. PhD(మెకానికల్ ఇంజినీరింగ్/కెమికల్ ఇంజినీరింగ్)అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.1,00000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ird.iitd.ac.in

News January 30, 2026

విష్ణువు వరాహ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు?

image

హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి, భూమిని సముద్ర గర్భంలో దాచాడు. దీంతో సృష్టి కార్యానికి ఆటంకం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుంచి అతి చిన్న రూపంలో వరాహ స్వామి ఉద్భవించాడు. క్షణ కాలంలోనే ప్రచండ రూపం దాల్చాడు. లోకోద్ధరణ కోసం సముద్రంలోకి దూకి, హిరణ్యాక్షుడిని సంహరించి, కోరలపై భూమిని నిలిపి పైకి తెచ్చాడు. వేదాలను రక్షించి, భూమిని ఉద్ధరించడమే ఈ అవతార ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత తిరుమలలో కొలువయ్యారు.