News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News February 10, 2026
CMపై భూకబ్జా ఆరోపణలు..రూ.500 కోట్లకు పరువు నష్టం దావా

రాష్ట్రంలో సుమారు 7,440 ఎకరాల భూమిని తాను, కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను అస్సాం CM హిమంత బిశ్వ శర్మ ఖండించారు. తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగోయ్పై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు SM ద్వారా CM తెలిపారు. ఆధారాలు ఉంటే కోర్టులో నిరూపించాలని డిమాండ్ చేశారు.
News February 10, 2026
నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో 376 పోస్టులు

న్యూఢిల్లీలోని <
News February 10, 2026
FLASH: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంకాలానికి కాస్త పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,58,780కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,45,550 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


