News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News January 27, 2026
వంటింటి చిట్కాలు

* వంటకాల్లో ఉల్లి వాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వేయించే ముందు పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * కలిపిన చపాతీ పిండిపై తడిబట్టను కప్పితే అది ఎండిపోకుండా ఉంటుంది. * పెరుగు పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి. * మొక్కజొన్నలు ఉడికించేప్పుడు చెంచా నిమ్మరసం చేరిస్తే రంగు మారకుండా ఉంటాయి.
News January 27, 2026
భారత్తో డీల్కు కెనడా ఆసక్తి!

భారత్తో బిజినెస్ డీల్కు కెనడా కూడా ఆసక్తి చూపుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆ దేశ PM కార్నే భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలపై సైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్తో యూరోపియన్ యూనియన్ బిగ్ డీల్ చేసుకుంది. దీనిపై ఇవాళ ప్రధాని మోదీ, ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ప్రకటన చేయనున్నారు. మనదేశంపై భారీగా టారిఫ్స్ వేసిన ట్రంప్కు ఈ డీల్స్తో సమాధానం చెప్పే అవకాశం లభించింది.
News January 27, 2026
భారత్-ఈయూ ఒప్పందంపై అమెరికా అక్కసు

ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక<<18969639>> ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్<<>> (FTA) ఖరారు కావడంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. EU కంటే తామే ఎక్కువ త్యాగాలు చేశామని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించామని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గొప్పలు చెప్పుకున్నారు. ఉక్రెయిన్ కోసం తాము రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై టారిఫ్లు విధిస్తే, EU మాత్రం ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు.


