News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News February 3, 2026
పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 3, 2026
రూ.20 వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.2,80,000 పలుకుతోంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గింది. ఇది ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూసే అయినా.. శుభకార్యాల ముందు <<19036596>>బంగారం<<>>, వెండి ధరలు పడిపోవడం సామాన్యుడికి శుభవార్తే.
News February 3, 2026
‘CM బ్రేక్ ఫాస్ట్’కు రూ.500కోట్ల ప్రపోజల్స్

TG: చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రపోజల్స్ పంపించింది. మిడ్ డే మీల్స్ కోసం రూ.600 కోట్లు ఇవ్వాలని కోరింది. గతేడాది రూ.530 కోట్లు ఖర్చయిందని, గుడ్ల ధరలు పెరిగినందున ఎస్టిమేషన్స్ పెంచుతూ అధికారులు ప్రపోజల్స్ రెడీ చేసి పంపించారు. రాష్ట్రంలోని దాదాపు 28వేల స్కూల్స్లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


