News December 10, 2024

రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

image

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.

Similar News

News January 10, 2026

పోక్సో చట్టంలో ‘రోమియో-జూలియట్’ రూల్ తీసుకురండి: SC

image

పోక్సో చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛమైన టీనేజ్ లవ్ రిలేషన్స్‌ను ప్రాసిక్యూషన్ నుంచి మినహాయించేందుకు పోక్సో చట్టంలో ‘రోమియో-జూలియట్’ రూల్ తీసుకురావాలని సూచించింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు చట్టాన్ని వాడుకుంటున్నారని పేర్కొంది. టీనేజర్లు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని నేరంగా పరిగణించకుండా రక్షణ కల్పించే మినహాయింపే రోమియో-జూలియట్ రూల్.

News January 10, 2026

నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్‌ని: రేవంత్

image

TG: తాను వైద్యుడిని కాదని, సోషల్ డాక్టర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో నైపుణ్యాలు పెంచుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లే. క్వాలిటీ ఆఫ్ హెల్త్ గురించి అంతా కృషి చేయాలి’ అని ఆయన కోరారు.

News January 10, 2026

ట్రంప్‌కు నోబెల్ ఆఫర్.. స్పందించిన నార్వే కమిటీ!

image

తనకు లభించిన శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇస్తానని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో చెప్పడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పందించింది. ‘నోబెల్ బహుమతిని రద్దు చేయడం, ఇతరులతో పంచుకోవడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదు. ఒకసారి ప్రకటన చేసిన తర్వాత అదే శాశ్వతం’ అని స్పష్టం చేసింది. 8 యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి <<18812581>>రావాల్సిందంటూ<<>> ట్రంప్ తరచూ చెబుతున్న విషయం తెలిసిందే.