News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News January 19, 2026
దావోస్కు సీఎం.. సింగపూర్ అధ్యక్షుడితో భేటీ

AP: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు. అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సమావేశం అయ్యారు. అంతకుముందు జ్యురిచ్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.
News January 19, 2026
స్పెయిన్ రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య

దక్షిణ స్పెయిన్లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న ఇరియో హైస్పీడ్ రైలు అడముజ్ సమీపంలో పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 రైళ్ల బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదేళ్ల కాలంలో స్పెయిన్లో జరిగిన అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం ఇదే.
News January 19, 2026
INC అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్: బండి

TG: సీఎం రేవంత్ <<18890595>>వ్యాఖ్యలకు<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. INC ఇప్పుడు ఇటలీ నేషనల్ కాంగ్రెస్గా మారిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ను రద్దు చేయాలన్న గాంధీ విష్ను ఆ పార్టీ నెరవేర్చలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 70 ఏళ్ల కాంగ్రెస్ బానిసత్వ ఆలోచనలను తొలగిస్తున్నామన్నారు. సీఎం స్కిల్స్ యూనివర్సిటీలో పాలిటిక్స్ కోర్సును చేర్చి విద్యార్థిగా చేరాలని చురకలు అంటించారు.


