News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News January 31, 2026
28,740 పోస్టులకు నోటిఫికేషన్

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు నేటి నుంచి FEB 14వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సైట్: https://indiapostgdsonline.gov.in/
News January 31, 2026
రాష్ట్రానికి నిధుల కోసం ఐక్యంగా పోరాడాలి: పొన్నం

TG: తెలంగాణ పుట్టుకనే PM మోదీ అవమానించారని, రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ 11 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారైనా RRR, మెట్రో, ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని కోరారు. విజన్ 2047కు అనుగుణంగా కేంద్రం మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీజేపీ సహా రాష్ట్ర ఎంపీలతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
News January 31, 2026
కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు నివారణ ఎలా?

ప్రస్తుతం తేమతో కూడిన వాతావరణం వల్ల కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. అలాగే మొక్క నుంచి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారతాయి. ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి రిడోమిల్ 3 గ్రాములను కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంటలో తెలుగు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రిడోమిల్ 3గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


