News December 10, 2024

రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

image

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.

Similar News

News February 18, 2026

ఏప్రిల్ 19 నుంచి చార్‌ధామ్ యాత్ర.. రిజిస్ట్రేషన్‌కు ఫీజు!

image

పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌కు మినిమమ్ ఫీజు వసూలు చేయనున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఫీజు ఎంతనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి, 22న కేదార్‌నాథ్, 23న బద్రీనాథ్ తెరుచుకోనున్నాయి.

News February 18, 2026

వంగలో ఆకుమాడు తెగులు – నివారణ

image

వంగ పంటలో నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఆకుమాడు తెగులు ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలాగే గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి, వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

News February 18, 2026

T20 WC: పాక్ ఓడితే ఇంటికే!

image

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు సౌతాఫ్రికా-UAE, 3PMకు పాకిస్థాన్-నమీబియా, 7PMకు ఇండియా- నెదర్లాండ్స్ తలపడనున్నాయి. నేటి మ్యాచ్‌లో పాక్ గెలిస్తే S-8కు అర్హత సాధించనుంది. ఓడితే మాత్రం రన్ రేట్ ఆధారంగా USAకు అవకాశం దక్కనుంది. ఇక ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, జింబాబ్వే S-8కు వెళ్లాయి.