News March 30, 2024

ఈసీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: అంబటి

image

AP: వాలంటీర్లపై ఈసీ తీసుకున్న నిర్ణయం బాధాకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ నిర్ణయంపై ఈసీ పునరాలోచన చేయాలని కోరారు. ‘ఈసీ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడతారు. చంద్రబాబు, పవన్ వాలంటీర్ల సేవలను ప్రశంసించాల్సింది పోయి.. అడ్డుకుంటున్నారు. జగన్‌పై కక్షతో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి కుట్రలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News January 25, 2025

విజయసాయి బీజేపీలో చేరడం లేదు: పురందీశ్వరి

image

AP: విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. ‘విజయసాయి బీజేపీలో చేరుతారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారా? ప్రతి సభ్యుడికి వారిద్దరూ సపోర్ట్‌గా ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకు సపోర్ట్ చేశారని మాత్రమే VSR అన్నారు’ అని గుర్తుచేశారు.

News January 25, 2025

ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి!

image

ఆఫ్రికా దేశం సూడాన్‌లోని ఆసుపత్రిపై డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 2023 ఏప్రిల్ నుంచి ఈ దేశంలో సూడాన్ ఆర్మీకి అక్కడ రాపిడ్ ఫోర్స్‌కి మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొన్ని వారాల క్రితం ఆసుపత్రిపై ఇదే తరహా డ్రోన్ దాడి జరిగినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

News January 25, 2025

నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు: షర్మిల

image

AP: బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీని వీడారని అన్నారు. ‘జగన్‌కు విజయసాయి అత్యంత సన్నిహితుడు. ఎవరిని తిట్టమంటే వారిని తిడతాడు. అలాంటి ఆయన రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు. నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేక పోతున్నారు. VSRను BJPలోకి పంపుతున్నారు’ అని ఆరోపించారు.