News September 30, 2024

సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు

image

ముడా కేసులో మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్దరామ‌య్య‌ సహా పలువురిపై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించినా సిద్దరామ‌య్య‌కు ఊర‌ట ద‌క్కలేదు. దీంతో లోకాయుక్తలో ఆయనపై FIR నమోదైన విషయం తెలిసిందే. మైసూరు అర్బ‌న్ డెవ‌లప్మెంట్ అథారిటీలో సీఎం సతీమణికి భూకేటాయింపులపై వివాదం చెలరేగింది.

Similar News

News September 30, 2024

CBN హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ట్రెండింగ్

image

తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు AP CM చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తవ్వకముందే ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందంటూ ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో ‘CBN Should Apologize Hindus’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైసీపీ ఈ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, హిందువులందరూ CBNని క్షమాపణ అడుగుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు.

News September 30, 2024

లాక్‌డౌన్ వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రత తగ్గుదల!

image

కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని భారత పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వారి నివేదిక ప్రకారం.. 2017-23 మధ్యకాలంలో చంద్రుడిపై 6 వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల్ని నాసా ఆర్బిటర్ డేటా సాయంతో స్టడీ చేశారు. ఈక్రమంలో లాక్‌డౌన్ కాలంలో చందమామపై టెంపరేచర్ గణనీయంగా తగ్గిందని గుర్తించారు. కాలుష్యం తగ్గడంతో భూమి నుంచి వెలువడే రేడియేషన్ కూడా తగ్గడమే దీనికి కారణం కావొచ్చని వారు అంచనా వేశారు.

News September 30, 2024

పాతబస్తీకి హైడ్రా వస్తే తీవ్ర పరిణామాలు: MIM ఎమ్మెల్యేలు

image

TG: హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. ఇప్పటివరకు తమ ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదని చెప్పారు. బుల్డోజర్లు వస్తే తమ పైనుంచే వెళ్లాలని అల్టిమేటం జారీ చేశారు.